NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ..
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ..
    కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ..

    Chandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 08, 2024
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని తన పర్యటన రెండవ రోజు కొనసాగిస్తున్నారు.

    మొదటి రోజు బిజీగా గడిపిన చంద్రబాబు, ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు జరుపుతున్నారు.

    ఈరోజు మొదటగా, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు.

    ఈ సమావేశంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. రాజధాని అమరావతికి అన్ని జిల్లాల కనెక్టివిటీ, అమరావతి - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి - రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ వంటి కీలక అంశాలు చర్చించారు.

    వివరాలు 

    పోలవరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు: చంద్రబాబు 

    మొదటి రోజు పర్యటనలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.

    ఆ తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేక సమావేశం జరిపారు. ప్రధానితో సమావేశం ఫలప్రదమైందని చంద్రబాబు ట్విట్టర్‌లో పంచుకున్నారు.

    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలను వివరించినట్లు చెప్పారు.

    రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

    అలాగే, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం తర్వాత కూడా చంద్రబాబు ఎక్స్‌లో మరో పోస్ట్ పెట్టారు.

    వివరాలు 

    రైల్వే శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం పని చేయడానికి సిద్ధం

    డిసెంబర్‌లో వైజాగ్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయబడుతుందని, రైల్వే శాఖ ఏపీలో 73,743 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు.

    హౌరా-చెన్నై నాలుగు లైన్ల ప్రాజెక్టులో భాగంగా 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంలో సహకరించనున్నారు.

    రైల్వే శాఖతో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంగా పని చేయడానికి సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.

    ఇక ఈ రోజు సాయంత్రం 4:30కు కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో,5:45కు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో, రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, రాత్రి 11:15కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    నితిన్ గడ్కరీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం.. 2,100 మంది సిబ్బందితో బురద తొలగింపు : సీఎం  వరదలు
    Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్
    Chandrababu Naidu:  సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ముప్పు .. భారతదేశం
    CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు  భారతదేశం

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025