NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pawan Kalyan: కారుణ్య నియామకాలకు ఆమోదం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
    తదుపరి వార్తా కథనం
    Pawan Kalyan: కారుణ్య నియామకాలకు ఆమోదం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
    కారుణ్య నియామకాలకు ఆమోదం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

    Pawan Kalyan: కారుణ్య నియామకాలకు ఆమోదం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 25, 2024
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాల జాబితాలో ఉన్న అభ్యర్థులను జిల్లా కలెక్టర్ల కామన్ పూల్‌లో ఖాళీల్లో నియమించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

    రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఉద్యోగులు, స్కూళ్ల ఉపాధ్యాయులు మరణించినప్పుడు వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాల్సి ఉంటుంది.

    ఈ అంశంపై డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి, కమిషనర్‌తో సమావేశాన్ని నిర్వహించారు.

    పంచాయతీరాజ్‌ సంస్థల పరిధిలో ఖాళీల కొరత కారణంగా కారుణ్య నియామకాలలో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

    వివరాలు

     నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ 

    కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి-గొల్లమంద రోడ్డు పునర్నిర్మాణంపై కూడా పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.

    ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు ప్రాజెక్టులో భాగంగా రూ. 13.45 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని అధికారులకు సూచించారు.

    ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా 700 మీటర్ల మేర ఈ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

    మోదీ ప్రసంగాలలో 140 కోట్ల భారతీయుల ఆశలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

    297 పురాతన వస్తువులను తిరిగి పొందడంపై, శాంతి, సంస్కరణల పట్ల మోదీ ఇచ్చిన పిలుపు ప్రపంచ దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

    Details

    సనాతన ధర్మాన్ని కించపరిస్తే తీవ్రమైన పరిణామాలు

    తిరుమల లడ్డూ అపవిత్రం కావడం పట్ల పవన్ కళ్యాణ్ విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొన్నారు.

    సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తప్పులు జరిగితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, లేకపోతే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

    ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురుకావచ్చని హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పవన్ కళ్యాణ్

    Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ పర్యటన  జనసేన
    OG Movie : వైరల్ అవుతున్న OG డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ డీపీ  సినిమా
    Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్  జనసేన
    బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ  చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు భారతదేశం
    Floods: ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు.. జలాశయాలకు పోటెత్తిన వరద భారతదేశం
    AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...! కేంద్ర ప్రభుత్వం
    APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025