NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే
    తదుపరి వార్తా కథనం
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే

    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే

    వ్రాసిన వారు Stalin
    May 09, 2023
    07:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. పోలింగ్ బుధువారం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసింది.

    కర్ణాటకలో 38ఏళ్లుగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి అధికారంలోకి రాలేదు. అయితే ఈ సారి మోదీ చరిష్మాతో ఆ రికార్డును చెరిపేయాలని బీజేపీ భావిస్తోంది. సెంటిమెంట్ కలిసిస్తోందని, బీజేపీ వైఫల్యాలే తమ పార్టీని గెలిపిస్తాయని కాంగ్రెస్ గంపెడు ఆశపు పెట్టుకుంది.

    అలాగే జేడీఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మూడు పార్టీల భవితవ్యం బుధవారం తేలనుంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా, అధికారంలోకి రావాల్సిన పార్టీ 113 సీట్లు గెలవాల్సి ఉంటుంది.

    కర్ణాటక

    ప్రచారంలో దూసుకుపోయిన బీజేపీ

    కర్ణాటకలో విజయం సాధించడం ద్వారా ఈ ఏడాది జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తున్నాయి.

    కలబురగి జిల్లాకు చెందిన కన్నడిగ ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికల్లో కనీసం 150 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 99 బహిరంగ సభలు, 33 రోడ్ షోలు నిర్వహించారు. అయితే ప్రచారం విషయంలో మాత్రం కాస్త బీజేపీనే ముందుందని చెప్పాలి.

    ఏకంగా 206 బహిరంగ సభలు, 90 రోడ్‌షోలు, రాష్ట్ర నాయకులు 231 బహిరంగ సభలు, 48 రోడ్‌షోలు నిర్వహించినట్లు పార్టీ తెలిపింది. ఈ ఎన్నికల్లో కూడా జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    కర్ణాటక

    కీలక అసెంబ్లీ స్థానాలు ఇవే

    షిగ్గావ్: ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

    వరుణ: వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఆయన కుటుంబానికి కంచుకోటగా మారింది. 2018లో అతని కుమారుడు యతీంద్ర ఇక్కడి నుంచి గెలిచారు.

    కనకపుర: ఈ నియోజకవర్గం కేపీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్ సొంతగడ్డ. 2008 నుంచి ఆయన ఇక్కడి నుంచి గెలుస్తున్నారు. ఈసారి శివకుమార్ రెవెన్యూ మంత్రి, బీజేపీ నేత ఆర్ అశోకతో తలపడనున్నారు.

    చన్నపట్న: ఈ పొలిటికల్ హాట్ సీటులో జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి, బీజేపీ అభ్యర్థి సీపీ యోగేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి గంగాధర్ ఎస్ మధ్య పోరు సాగనుంది.

    షికారిపుర: ఇక్కడి నుంచి యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను బీజేపీ బరిలోకి దింపింది.

    కర్ణాటక

    రాష్ట్రంలో 58,282 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

    రాష్ట్రంలో 58,282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు సగటు ఓటర్లు 883గా అంచనా వేశారు.

    మొత్తం 1,320పోలింగ్ స్టేషన్‌లను మహిళా అధికారులు నిర్వహిస్తారు. 5.24 కోట్ల మంది ఓటర్లలో 5.60లక్షల మంది వికలాంగులుగా గుర్తించారు.

    వృద్ధులు, వికలాంగుల కోసం ఈ సారి ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. వారికి ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.

    కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17%, వొక్కలిగాలు 15%, ఓబీసీలు 35%, ఎస్సీ, ఎస్టీలు 18%, ముస్లింలు 12.92% బ్రాహ్మణులు 3% ఉన్నారు.

    కర్ణాటకలో లింగాయత్‌లు 100స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తారు. అసెంబ్లీలో అధికార బీజేపీకి చెందిన 37 మందితో సహా మొత్తం 54 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు
    కాంగ్రెస్

    తాజా

    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి

    కర్ణాటక

    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక నరేంద్ర మోదీ
    కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ ఎన్ఐఏ

    అసెంబ్లీ ఎన్నికలు

    నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం నాగాలాండ్
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ త్రిపుర
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    మార్చి 7న నాగాలాండ్ సీఎంగా ​​ 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం నాగాలాండ్

    తాజా వార్తలు

    ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే? ఆంధ్రప్రదేశ్
    దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు  దిల్లీ
    NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? భారతదేశం
    ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్  అమెరికా

    కాంగ్రెస్

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు రాహుల్ గాంధీ
    Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ కర్ణాటక
    శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025