
PM Modi: 'మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం'.. పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
"మన మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచిన వారిని మట్టిలో కలిపేశాం" అని ప్రధాని మోదీ అన్నారు.
ఆయన ప్రస్తుతం రాజస్థాన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బికనీర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ శక్తివంతమైన ప్రసంగం చేశారు.
ఆపరేషన్ సిందూర్ ద్వారా తీవ్రవాదులను ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలకు సంపూర్ణ స్వేచ్ఛను కల్పించిందని గుర్తుచేశారు.
మన దళాలు చక్ర వ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని తెలిపారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి కేవలం 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చామని మోదీ చెప్పారు.
వివరాలు
100 మంది ఉగ్రవాదులు హతం
ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన ఈ యుద్ధ కార్యకలాపంలో ఉగ్రవాదుల స్థావరాలను సమూలంగా నాశనం చేశామని తెలిపారు.
భారత్ నేలపై రక్తపుటేర్లు పారించిన .. వారిని ముక్కలు ముక్కలుగా చేసామని స్పష్టం చేశారు.
మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో జైష్-ఎ-మొహమ్మద్,లష్కరే-ఎ-తోయిబా,హిజ్బుల్ ముజాహిదీన్ వంటి పలు ఉగ్ర సంస్థలతో అనుబంధం ఉన్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రధాని తెలిపారు.
ఉగ్రవాదంపై పోరాటానికి దేశం మొత్తం ఐక్యంగా నిలిచిందని పేర్కొన్నారు.పహల్గామ్ ఉగ్రదాడి దేశంలోని 140 కోట్ల మంది ప్రజల మనసులను కదిలించిందని వివరించారు.
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల గుండెపై దాడి చేశామన్నారు. ఇది త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛనివ్వడం వల్ల సాధ్యమైందని మోదీ చెప్పుకొచ్చారు.
వివరాలు
కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా నాశనం
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులనే లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు, మతం ఆధారంగా వారు మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచేశారని ప్రధానమంత్రి అన్నారు.
అందుకే మన సైనికులు వారి పైన భయంకర ప్రతీకారం తీశారని పేర్కొన్నారు.
140 కోట్ల మంది భారతీయుల మనసులను గాయపరిచిన వారిని మన దళాలు చీల్చిచెదిమేశాయని తెలిపారు.
కేవలం 22 నిమిషాల్లోనే వారి శిబిరాలను పూర్తిగా నాశనం చేశామని వివరించారు.
త్రివిధ దళాల దెబ్బతో పాకిస్థాన్ వెనక్కి తగ్గిందని స్పష్టం చేశారు. అణు బాంబుల భయంతో భారత్ వెనుకడుగు వేయదని ప్రధాని మోదీ గట్టిగా వెల్లడించారు.
వివరాలు
103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ
ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా నిర్మించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ రాజస్థాన్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
ఈ స్టేషన్లను జాతికి అంకితం చేశారు. ఈ ప్రారంభంలో తెలంగాణకు చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట స్టేషన్ను కూడా ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్లో 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్లో 8 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించినట్లు మోదీ వెల్లడించారు.