NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Central Cabinet Decisions: 14 పంటలకు MSP పెంపు.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్
    తదుపరి వార్తా కథనం
    Central Cabinet Decisions: 14 పంటలకు MSP పెంపు.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్
    14 పంటలకు MSP పెంపు.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్

    Central Cabinet Decisions: 14 పంటలకు MSP పెంపు.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి సహా మొత్తం 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపును ఆమోదించింది.

    దీనిలో భాగంగా, ఒక క్వింటాల్ వరికి మద్దతు ధరను రూ.69 పెంచి, మొత్తంగా రూ.2369కి చేర్చింది.

    ఈ నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

    గత 10 నుంచి 11ఏళ్లలో ఖరీఫ్ పంటల ఎంఎస్‌పీలో ఇదే అత్యధిక పెంపుగా ఆయన అభివర్ణించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు అనుగుణంగా ఈ పెంపు చేపట్టినట్టు తెలిపారు.

    ఈ ఎంఎస్‌పీ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2.7లక్షల కోట్ల నిధులు కేటాయించింది.

    అంతేకాకుండా, రైతులకు వడ్డీ రాయితీగా రూ.15,642కోట్లు అందించనున్నట్టు వెల్లడించారు.

    వివరాలు 

    ఆంధ్రప్రదేశ్‌లో రహదారి అభివృద్ధికి కేంద్ర ఆమోదం 

    అన్నదాతల పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభదాయక మార్జిన్‌ లభించేలా చర్యలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు.

    ఇక మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నుంచి నెల్లూరు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

    మొత్తం రూ.3,653 కోట్ల వ్యయంతో 108.134 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి అభివృద్ధి చేయనున్నారు.

    బద్వేల్‌లో గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నిర్మించనున్న ఈ రహదారి కారిడార్ ద్వారా, కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం సుమారు 33.9 కిలోమీటర్ల వరకు తగ్గనుంది.

    ఈ ప్రాజెక్టుతో భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని కేంద్రం వెల్లడించింది. ఈ రహదారి కారిడార్ నిర్మాణం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడే అవకాశముందని భావిస్తున్నారు.

    వివరాలు 

    ప్రతి పంటకు పెరిగిన మద్దతు ధర వివరాలు 

    ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 14 పంటలకు ఎంఎస్‌పీ పెరిగింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

    వరి (సాధారణ & గ్రేడ్-ఏ): ₹69 పెంపు

    జొన్నలు: ₹328 పెంపు

    సజ్జలు: ₹150 పెంపు

    రాగులు: ₹596 పెంపు

    మొక్కజొన్న: ₹175 పెంపు

    కందిపప్పు: ₹450 పెంపు

    పెసరపప్పు: ₹86 పెంపు

    మినుములు: ₹400 పెంపు

    వేరుశెనగ: ₹480 పెంపు

    పొద్దుతిరుగుడు: ₹441 పెంపు

    సోయాబీన్: ₹436 పెంపు

    కుసుమలు: ₹579 పెంపు

    వలిశలు (గడ్డినువ్వులు): ₹820 పెంపు

    పత్తి: ₹589 పెంపు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర కేబినెట్

    తాజా

    Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు ఇరాన్
    OG: ఓజీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ వైరల్  పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: ఒక రూపాయితో కోటీశ్వరుడవ్వడం సాధ్యమేనా..?.. ఫాంటసీ క్రికెట్ యాప్స్ మాయలో పడుతున్న భారత యువత బెట్టింగ్‌ యాప్స్‌
    Indian Army New Act: త్రివిధ దళాలకు ఉమ్మడి కమాండ్.. ఇంటర్-సర్వీసెస్ చట్టానికి గెజిట్ నోటిఫికేషన్ ఆర్మీ

    కేంద్ర కేబినెట్

    సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్
    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు  అనురాగ్ సింగ్ ఠాకూర్
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  తాజా వార్తలు
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025