NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravarti-Hyderabad: అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Amaravarti-Hyderabad: అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
    అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

    Amaravarti-Hyderabad: అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 09, 2025
    03:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇంకా పరిష్కారం కాని అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వివిధ అంశాల పరిష్కారానికి సంబంధించి సంబంధిత కేంద్ర శాఖలకు హోంశాఖ నిర్దేశనలు జారీ చేసింది.

    ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ అధ్యక్షతన 15 శాఖల ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశంలో రోడ్లు-ఉపరితల రవాణా,ఉక్కు,బొగ్గు గనులు,వ్యవసాయం,పెట్రోలియం, రైల్వే తదితర శాఖల అధికారులతో చర్చలు జరిగాయి.

    ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, అలాగే పునర్విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలపై లోతుగా సమీక్షించారు.

    ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను కేంద్ర హోంశాఖ ఇటీవలే రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపించింది.

    వివరాలు 

    విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌

    ఈ సమీక్షలో అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

    డీపీఆర్ తయారీ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా రోడ్లు-ఉపరితల రవాణాశాఖకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

    అలాగే, తెలంగాణలోని ఉత్తర భాగం రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) కు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా సూచించింది.

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన మేరకు, రాష్ట్రంలో మరో రిఫైనరీ ఏర్పాటు అవకాశాలపై పరిశీలన చేయాలని హోంశాఖ పెట్రోలియం శాఖకు సూచించింది.

    అలాగే, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ పనులను వేగంగా కొనసాగించి, రెండు సంవత్సరాలలో అక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను ఆదేశించింది.

    వివరాలు 

    వెనుకబడిన ప్రాంతాలకు నిధులు

    ఇంతేకాకుండా, విశాఖ, అమరావతి, కర్నూలు, హైదరాబాద్ కారిడార్ల అభివృద్ధిపై రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పాజిటివ్‌గా పరిగణించాల్సిందిగా తెలిపింది.

    అంతేగాక, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలకు విడుదల కావలసిన నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో వాటిని త్వరితగతిన విడుదల చేయాలని సూచించింది.

    అదే సమయంలో, తెలంగాణకు సంబంధించి నిధుల అంశంపై నీతి ఆయోగ్‌తో చర్చించాల్సిందిగా అధికారులకు హోంశాఖ స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్

    అమరావతి

    Amaravati: అమరావతి నిర్మాణానికి ఊతం.. హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.16,000 కోట్ల రుణం చంద్రబాబు నాయుడు
    Amarawati: అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా గెజిట్.. జూన్‌ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని భారతదేశం
    CM Chandrababu: అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐకానిక్‌ భవనం.. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్‌స్టేషన్లు చంద్రబాబు నాయుడు
    Basavatarakam: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం.. అమరావతిలో 15 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025