NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనులకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్?
    తదుపరి వార్తా కథనం
    RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనులకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్?
    ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనులకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్?

    RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనులకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 16, 2024
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనులను కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారా ఉత్తర భాగం పనులను కేంద్రం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే, దక్షిణ భాగం పనులను రాష్ట్రం చేపట్టాలని నిర్ణయించింది.

    అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో కేంద్ర రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై, ఉత్తర భాగం పనులకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక అనుమతులు త్వరగా ఇవ్వాలని అభ్యర్థించారు.

    ఈ సందర్భంగా దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టే ఆలోచన చర్చకు వస్తోంది.

    Details

    రూ.14,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం

    ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఇప్పటికే ఎన్‌హెచ్‌ నంబరును కేంద్రం ప్రకటించడంతో ఇప్పుడు రెండు భాగాలను కేంద్రమే పూర్తి చేసి ఇదే నంబరుతో పనులను కొనసాగించాలని కేంద్రమంత్రి సూచలిచ్చినట్లు సమాచారం.

    ఆర్‌ఆర్‌ఆర్‌ మొత్తం 351 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిన తర్వాత పనులు వేగంగా ప్రారంభమవుతాయని నితిన్ గడ్కరీ తెలిపారు.

    దక్షిణ భాగం (190 కిలోమీటర్ల)పై డీపీఆర్‌ తయారీకి రాష్ట్రం ఇటీవల కన్సల్టెన్సీ సంస్థ కోసం టెండర్లు పిలిచింది.

    ఈ పనులకు రూ.14,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

    రాష్ట్రానికి నిధుల సమీకరణలో కష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రమే ఈ పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

    Details

    90శాతం భూ సేకరణ పూర్తి

    కాగా ఉత్తర భాగం పనుల కోసం 161.59 కిలోమీటర్ల భూసేకరణ 90 శాతానికి పైగా పూర్తి చేశారు.

    94 హెక్టార్ల భూమి కోర్టు కేసుల్లో ఉన్నా మిగతా భూముల సేకరణకు సంబంధించిన వివరాలు సిద్ధంగా ఉన్నాయి.

    ఈ పరిణామాలతో, సాంకేతిక అనుమతులు మంజూరైతే, ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Anurag Kashyap: లాభాల కోసం కళను తాకట్టు పెట్టిన ఓటీటీ వేదికలు : అనురాగ్ కశ్యప్‌ ఓటిటి
    Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన టీమ్‌.. ఎప్పుడంటే?  హరిహర వీరమల్లు
    Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    IPL 2025: స్టార్క్‌ ఔట్‌.. హేజిల్‌వుడ్‌ ఇన్‌! దిల్లీకి ఎదురుదెబ్బ, ఆర్సీబీకి ఊరట  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ

    కేంద్ర ప్రభుత్వం

    Vivad Se Vishwas 2.0: అక్టోబర్‌ 1 నుంచి వివాద్‌ సే విశ్వాస్‌ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం నిర్మలా సీతారామన్
    Andhra Pradesh: ఏపీ సర్కార్ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎంఎస్ఎంఈ పరిశ్రమ విజయవాడలో ఏర్పాటు.. ఆంధ్రప్రదేశ్
    Wage For Unorganised Sector Workers: మోడీ సర్కారు దసరా కానుక.. కార్మికుల వేతనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం భారతదేశం
    PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్‌ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025