NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..! 
    ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..!

    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2025
    11:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) అంశంపై చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి.

    అయితే, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని సమాచారం.

    ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే విషయంలో కేంద్రం ముందడుగు వేయడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

    వాస్తవానికి ఈ అంశంపై కేంద్రం స్పందన మాత్రం ఈ ఏడాది జులైలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లోనే ఇవ్వబోతుందని తెలుస్తోంది.

    వివరాలు 

    పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయడం అత్యవసరం: రాహుల్ 

    పహల్గాం దాడి జరిగిన తరువాతి పరిణామాలు, ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, లోక్‌సభ విపక్షనేత రాహుల్‌ గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    ''ఈ సంక్లిష్ట సమయంలో దేశ ఐక్యతను ప్రతిబింబించేలా, పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయడం అత్యవసరం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

    రాహుల్‌గాంధీతో పాటు మరికొంతమంది విపక్ష ఎంపీలు కూడా ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు.

    వివరాలు 

    జులైలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 

    ఇక, విపక్షాల ఈ డిమాండ్‌పై అధికార బీజేపీ నేతలు స్పందిస్తూ, ప్రస్తుతం ఆపరేషన్‌ సిందూర్‌ తాత్కాలికంగా నిలిపివేసిన తరుణంలో ఇలాంటి చర్చలు అవసరం లేదని పేర్కొన్నారు.

    రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు అనవసర చర్చలు జరపడం సమంజసం కాదని విమర్శించారు.

    ఆపరేషన్‌ పూర్తైన తర్వాత అవసరమైతే చర్చకు సిద్ధంగా ఉంటామని సూచించారు.

    ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక సమావేశానికి ఆసక్తి చూపడం లేదన్న వార్తలు తాజాగా తెరపైకి వచ్చాయి.

    పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులైలో ప్రారంభమయ్యే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..!  ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు యూఏఈలో సంప్రదాయ స్వాగతం .. ఇంతకీ ఈ సంప్రదాయం ఏంటంటే?(వీడియో)  డొనాల్డ్ ట్రంప్
    Renu Desai: అర్థం లేని చర్చలు మానేసి, దేశాభిమానంతో ముందుకెళ్లండి: రేణూ దేశాయ్ టాలీవుడ్
    IndusInd Bank- Airtel: నష్టాల్లో ట్రేడవుతున్న ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఎందుకంటే..? షేర్ విలువ

    ఆపరేషన్‌ సిందూర్‌

    Opertion Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ .. రాజస్థాన్‌లో పాకిస్థాన్ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..! భారతదేశం
    Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు సినిమా
    IPL 2025: ఆపరేషన్ సిందూర్‌ను ఉటంకిస్తూ.. జైపూర్ స్టేడియంకు బాంబు బెదిరింపులు జైపూర్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' టైటిల్‌ కోసం బాలీవుడ్‌లో పోటీ.. 15 మంది నిర్మాతలు దరఖాస్తు  బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025