NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Piyush Goyal: అన్యాయమైన వాణిజ్య పద్ధతులే చైనా వృద్ధికి ఆజ్యం పోశాయి: పీయూష్ గోయెల్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Piyush Goyal: అన్యాయమైన వాణిజ్య పద్ధతులే చైనా వృద్ధికి ఆజ్యం పోశాయి: పీయూష్ గోయెల్‌
    అన్యాయమైన వాణిజ్య పద్ధతులే చైనా వృద్ధికి ఆజ్యం పోశాయి: పీయూష్ గోయెల్‌

    Piyush Goyal: అన్యాయమైన వాణిజ్య పద్ధతులే చైనా వృద్ధికి ఆజ్యం పోశాయి: పీయూష్ గోయెల్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 08, 2025
    10:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా అన్యాయ వాణిజ్య విధానాల ద్వారా తన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ ఆరోపించారు.

    ధరలను తారుమారు చేయడం, అర్థస్పష్టమైన సబ్సిడీలు కల్పించడం, అంతర్జాతీయ వాణిజ్య నియమాలకు విరుద్ధంగా కార్మిక విధానాలను అమలు చేయడం బీజింగ్ ప్రగతికి దారితీస్తున్న కారణాలుగా పేర్కొన్నారు.

    సోమవారం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

    గ్లోబల్ మార్కెట్లలో చైనా దూకుడు పెరుగుతుండటంపై గోయల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దీని ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోందని హెచ్చరించారు.

    ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు.

    వివరాలు 

    యూపీఏ కాలంలో ఇండియా-చైనా వాణిజ్య లోటు 25రెట్లు పెరిగింది 

    అందువల్ల అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల్లో మార్పులు తెచ్చే అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

    అదే సమయంలో ఆయన యూపీఏ పాలనను కూడా తీవ్రంగా విమర్శించారు.

    వాజపేయి హయాంలో ఇండియా-చైనా వాణిజ్య లోటు పరిమితంగా ఉన్నప్పటికీ, యూపీఏ కాలంలో అది 25రెట్లు పెరిగిందని ఆరోపించారు.

    అంతేగాక, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగినట్టు తెలిపారు.

    ఆ ఒప్పందం మనకు ఆశ్చర్యం కలిగించిందని, దాని తరువాత భారత్‌లోకి దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులపై సుంకాలు గణనీయంగా తగ్గించబడ్డాయని గోయల్ ఆరోపించారు.

    దీని ప్రభావంగా భారతదేశానికి చెందిన స్వదేశీ పరిశ్రమలు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయని,దేశం పూర్తిగా చైనా మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

    వివరాలు 

    వాణిజ్య యుద్ధానికి, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం మొదలయ్యే అవకాశం

    ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కౌంటర్ టారిఫ్‌లు చైనాను కూడా స్పందించాల్సిన పరిస్థితికి తీసుకెళ్లాయని, దీంతో వాణిజ్య యుద్ధానికి, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం మొదలయ్యే అవకాశం ఉందన్న భయాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేశాయని ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పీయూష్ గోయెల్‌

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పీయూష్ గోయెల్‌

    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  బ్రిక్స్ సమ్మిట్
    పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ రాజ్యసభ
    Tesla : భారత్‎లోకి టెస్లా.. పీయూష్‌ గోయల్‌తో మస్క్‌ భేటీ ఎప్పుడో తెలుసా టెస్లా
    Piyush Goyal: ఎగ్జిట్ పోల్ తర్వాత భారతీయ పెట్టుబడిదారులు లాభాలు పొందారు,రాహుల్‌కి ఏమీ తెలియదు;బీజేపీ ఎదురుదాడి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025