NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Free Bus: ఉగాది నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 
    తదుపరి వార్తా కథనం
    Free Bus: ఉగాది నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 
    ఉగాది నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

    Free Bus: ఉగాది నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 31, 2024
    08:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది పండుగ నాటికి అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

    ఇందుకు సంబంధించిన అవసరమైన ఏర్పాట్లు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

    ఇప్పటికే ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిన సమస్యలను పరిశీలించి, సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు.

    సోమవారం సచివాలయంలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి, ఆర్టీసీ ఎండీ, డీజీపీ ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే తదితరులతో కలిసి ఆర్టీసీ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు.

    వివరాలు 

    ఏర్పాట్లకు కొంత సమయం 

    ఈ పథకాన్ని సంక్రాంతి నాటికే ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ, జీరో టికెటింగ్ విధానం వంటి నిర్వహణలో అనేక మార్పులు అవసరమవడంతో ఈ పథకాన్ని ఉగాది నుంచి అమలు చేయాలని తుది నిర్ణయానికి వచ్చారు.

    ఉచిత ప్రయాణ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను సవరిస్తూ, మన రాష్ట్రంలో సమస్యలు రాకుండా ఉండే విధానంపై నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

    జనవరి 3న మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటక, జనవరి 6, 7 తేదీల్లో దిల్లీ పర్యటన చేసి, అక్కడి అనుభవాలను తెలుపనున్నట్లు మంత్రి రాంప్రసాదరెడ్డి వివరించారు.

    వివరాలు 

    అదనంగా మరో 1,250 బస్సులు

    సమావేశంలో విద్యుత్ బస్సులపై కూడా చర్చ జరిగింది. 'పీఎం-ఇ' బస్సు పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 750 విద్యుత్ బస్సులను తీసుకోవడం, అదనంగా మరో 1,250 బస్సులు అవసరమని అధికారులు తెలిపారు.

    దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, బస్సులను అద్దె విధానంలో తీసుకోవడం మంచిదా, ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయడం సమంజసమా అనే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు.

    నిర్వహణ భారం తక్కువగా ఉండే విధానాన్ని, మహిళల ఉచిత ప్రయాణానికి అనుకూలమైన పరిష్కార మార్గాలను ప్రతిపాదించాలని అధికారులకు సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్‌ బృందం కాంగ్రెస్
    Heavy Rains: ఢిల్లీలో వర్ష భీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు, నగరమంతా జలమయం దిల్లీ
    Akanda 2 : అఖండ 2 విడుదలపై ఉత్కంఠ.. సంక్రాంతి కంటే ముందుగానే ప్లాన్? బాలకృష్ణ
    Apple: ఆపిల్‌కు భారత్ ఓకే.. కానీ అమెరికాలో సుంకాలు తప్పవన్న ట్రంప్ ఆపిల్

    ఆంధ్రప్రదేశ్

    Daikin: ఏపీలో జపాన్‌కు చెందిన డైకిన్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు జపాన్
    Rain Alert:ఆంధ్రప్రదేశ్‌‌లో భారీ వర్షాలు..కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. భారీ వర్షాలు
    Andhra Pradesh: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. వారందరి పింఛన్‌లు కట్ భారతదేశం
    AP Govt : ఏపీలో చేనేత వస్త్రాల ధరలు పెంచిన సర్కారు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025