NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తం ఉండాలి.. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తం ఉండాలి.. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌
    కలెక్టర్లు.. ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్..

    Chandrababu: భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తం ఉండాలి.. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    01:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    అదే సమయంలో, ఉత్తరాంధ్ర,గోదావరి జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

    శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం,కాకినాడ,ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ,ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

    మరోవైపు, బుడమేరు ప్రాంతంలో వరద నీటి ప్రభావం కొంత తగ్గినట్లు తెలిపారు.సాయంత్రం నాటికి అనేక ప్రాంతాలు నీటి నుండి బయట పడతాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

    వాహనాలు,వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించాలని,అలాగే కాలువల గట్లు, వరద ప్రవాహాలను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు.

    వివరాలు 

     డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్.. 

    విజయవాడలో విద్యుత్ పునరుద్ధరణ దాదాపుగా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, మెడికల్ క్యాంపులు కొనసాగించాలని సీఎం ఆదేశించారు.

    వరద ప్రభావిత ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించడానికి మిగిలిన 5 టవర్లలో కూడా సిగ్నల్స్ త్వరగా అందుబాటులోకి రావాలని సూచనలు చేశారు.

    భారీ వర్షాల కారణంగా ఎర్రకాల్వలో వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలన్నారు.

    అదే విధంగా, ఏలేరు రిజర్వాయర్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లో,అవుట్‌ఫ్లో స‌మతుల్యంగా ఉండేలా చూడాలని, ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

    జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    చంద్రబాబు నాయుడు

    PM Modi- Chandrababu: మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ - ఏఏ అంశాలపై చర్చించుకున్నారంటే?  నరేంద్ర మోదీ
    Chandrababu: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇరువురి మధ్య ఐక్యత అవసరమన్న చంద్రబాబు భారతదేశం
    Chandrababu Naidu: నా కాళ్ళు మొక్కితే.. నేను మీ కాళ్లు మొక్కుతా: చంద్రబాబు నాయుడు   భారతదేశం
    Chandrababu : సహజ వనరుల దోపిడీకి గత సర్కార్ పాల్పడిందన్న చంద్రబాబు.. ఇవాళ శ్వేతపత్రం విడుదల భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025