NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం
    దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం

    Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 08, 2025
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ, కాంగ్రెస్‌ పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

    ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓటమిని మూటగట్టుకున్న హస్తం పార్టీ, ఇప్పుడు దిల్లీలో కూడా కనీస స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేదు.

    మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 41 స్థానాల్లో, ఆమ్‌ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్‌ శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది.

    Details

    అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి

    ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొంతవరకు పుంజుకుంది.

    2014 లోక్‌సభ ఎన్నికల్లో 44 స్థానాలు, 2019లో 52 స్థానాలు మాత్రమే గెలిచిన హస్తం పార్టీ, 2024 ఎన్నికల్లో మాత్రం 99 సీట్లు సాధించి మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకం కలిగించింది.

    రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్లు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల మద్దతు పొందడంలో కాంగ్రెస్‌ కొంత మేర విజయం సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

    అయితే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అదే జోష్‌ను కొనసాగించలేకపోయింది.

    Details

     హర్యానాలో ఘోర పరాజయం 

    లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది.

    హస్తం పార్టీ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగినా, బీజేపీ అనూహ్యంగా పుంజుకొని హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించింది.

    ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కాంగ్రెస్‌ మద్దతుగా కనిపించినా, చివరికి ఫలితాలు పార్టీ నాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ ఇచ్చాయి.

    మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూసింది.

    మహా వికాస్‌ అఘాడి కూటమి (కాంగ్రెస్, శివసేన-ఉద్ధవ, ఎన్సీపీ-శరద్ పవార్) ఘోరంగా ఓడిపోయింది.

    బీజేపీ, శివసేన-ఎక్స్‌ (షిండే గ్రూప్), ఎన్సీపీ-అజిత్ పవార్ కూటమిగా ఏర్పడిన మహాయుతి భారీ విజయం సాధించింది.

    Details

    దిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు డబుల్ షాక్

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా విఫలమైంది. మొత్తం 70 స్థానాల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది.

    రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో పార్టీ బలహీనంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది.

    ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించినా, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ కృషి వల్ల కాకుండా మిత్రపక్షాల మద్దతుతోనే ఆ విజయం సాధించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    రాష్ట్ర స్థాయిలో పార్టీ బలహీనపడుతుండటంతో, భవిష్యత్తులో గెలుపొందేలా మళ్లీ పునర్నిర్మాణం అవసరమన్న సూచనలు వినిపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    దిల్లీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    కాంగ్రెస్

    Priyanka Gandhi : ప్రియాంక గాంధీ రాజకీయ పయనం.. నానమ్మ ఆశయాలతో పార్లమెంట్‌కి..! ప్రియాంక గాంధీ
    Sridhar Babu : సంక్షోభాన్ని దాటుకుంటూ ముందుకు.. అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు తెలంగాణ
    INDIA Bloc: మమతా బెనర్జీకి పరోక్ష మద్దతు.. విపక్ష పార్టీల్లో కొత్త చర్చలకు ముడిపెడుతున్న లాలూ! ఇండియా కూటమి
    Rahul Gandi: రాజ్యాంగం అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు రాహుల్ గాంధీ

    దిల్లీ

    Cold Wave: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం  భారతదేశం
    Delhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా! బీజేపీ
    Delhi: దిల్లీ ఎయిర్‌పోర్టులో పొగమంచు ప్రభావం.. 30 విమానాలు రద్దు విమానాశ్రయం
    Fraud: మోడల్ ముసుగులో 700 మంది అమ్మాయిలను మోసం చేసిన టెక్నికల్‌ రిక్రూటర్‌ అరెస్ట్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025