NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress: వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్న కాంగ్రెస్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Congress: వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్న కాంగ్రెస్
    వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్న కాంగ్రెస్

    Congress: వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్న కాంగ్రెస్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 04, 2025
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌ (Congress) పార్టీ దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది.

    ఈ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) తెలిపారు.

    ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు ద్వారా ప్రకటించారు.

    "ఇండియా కూటమి త్వరలోనే వక్ఫ్‌ (సవరణ) బిల్లును సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్‌ చేయనుంది. భారత రాజ్యాంగంలోని మూల సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని మేం తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఉంటాం" అని ఆయన స్పష్టం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జైరామ్ రమేష్ చేసిన ట్వీట్ 

    The INC's challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.

    The INC's challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.

    The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being…

    — Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2025

    వివరాలు 

    లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ

    ఈ సందర్భంగా, గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయాన్ని రమేశ్‌ గుర్తుచేశారు.

    ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో 14 గంటలకు పైగా తీవ్ర చర్చ జరిగింది.

    విపక్షాల ఆరోపణలు, అధికారపక్షం కౌంటర్లతో సభ హోరాహోరీగా కొనసాగింది.

    అనంతరం ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టగా, బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు ఓడిపోయాయి.

    వివరాలు 

    రాష్ట్రపతి ఆమోదానికి పంపిన  వక్ఫ్ బిల్లు

    గురువారం, ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా, అర్ధరాత్రి దాటే వరకు దీనిపై విస్తృత చర్చ జరిగింది.

    అనంతరం జరిగిన ఓటింగ్‌లో, 128 మంది అనుకూలంగా, 95 మంది వ్యతిరేకంగా ఓటేశారు.

    ప్రతిపక్షాల ప్రతిపాదించిన సవరణలు తిరస్కరించబడ్డాయి. ప్రస్తుతం, ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు.

    ఆమోదం పొందిన వెంటనే ఇది చట్టంగా మారనుంది.

    ఈ బిల్లును 'యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియెన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లు' (ఉమీద్‌-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం నామకరణం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జైరామ్ రమేష్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    జైరామ్ రమేష్

    Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్  భారతదేశం
    Jairam Ramesh: కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్‌ నేత సంచలన ఆరోపణలు.. తోసిపుచ్చిన ఈసీ భారతదేశం
    Jairam Ramesh : ఎన్డీఏ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నెహ్రూ పేరు ప్రస్తావన కాంగ్రెస్
    Congress: ఎన్నికల నిబంధనలలో సవరణలు.. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025