NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cybercrime: పోలీసులు మైనర్లను విచారించవచ్చా.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Cybercrime: పోలీసులు మైనర్లను విచారించవచ్చా.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
    పోలీసులు మైనర్లను విచారించవచ్చా.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

    Cybercrime: పోలీసులు మైనర్లను విచారించవచ్చా.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 31, 2025
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చండీగఢ్‌కు ఆనుకుని ఉన్న జిరాక్‌పూర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి మౌలిక్ వర్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు మైనర్లతో వ్యవహరించే విధానంపై చర్చ జరుగుతోంది.

    గత శనివారం (మార్చి 22) జిరాక్‌పూర్‌లోని తన ఇంట్లో మౌలిక్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మౌలిక్ వర్మ కుటుంబం ఇప్పటికే జిరాక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేసింది.

    ఆత్మహత్యకు గల కారణాలు

    మౌలిక్ వర్మ చండీగఢ్,సెక్టార్ 21లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు.

    ఇన్‌స్టాగ్రామ్ పేజీలో స్కూల్ ఉపాధ్యాయులపై అభ్యంతరకరమైన పోస్టులు కనబడటంతో,స్కూల్ యాజమాన్యం చండీగఢ్ సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు చేసింది.

    సైబర్ సెల్ ఒక ఐపీ చిరునామాను గుర్తించి కొంతమంది విద్యార్థులను విచారించింది.

    వివరాలు 

    కుటుంబ సభ్యుల ఆరోపణలు 

    మౌలిక్ వర్మను కూడా సెక్టార్ 17లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు పిలిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

    పోలీసులు హింసించడంతోనే మౌలిక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఇతర విద్యార్థుల్లో ఒకరిని హింసించారని, ఆ విద్యార్థి నుంచి ఇతర విద్యార్థుల పేర్లు అడిగి తీసుకున్నారనీ, అందులో భాగంగానే మౌలిక్‌ను కూడా స్టేషన్‌కు పిలిచారని మౌలిక్ మామ శుభ్‌నీత్ చెప్పారు.

    ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను సృష్టించిన వారిలో మౌలిక్ లేరని, గతంలో ఉపాధ్యాయులు కూడా దీనిని అంగీకరించారని శుభ్‌నీత్ తెలిపారు.

    మౌలిక్‌ను తల్లిదండ్రుల తోడు లేకుండా ఒంటరిగా స్టేషన్‌కు పిలిచారని, ఇతర పిల్లల తల్లిదండ్రులు అక్కడ ఉన్నప్పటికీ మౌలిక్ ఒంటరిగా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    సూసైడ్ నోట్ 

    ''స్టేట్‌మెంట్‌పై సంతకం చేయమని పోలీసులు నన్ను ఒత్తిడి చేశారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నా కోసం ఆమె ఎవరినైనా ప్రాధేయపడడం నాకిష్టం లేదు. ఈ ఒత్తిడితోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా'' అని మౌలిక్ సూసైడ్‌ నోట్‌లో రాశాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

    స్కూల్ ప్రిన్సిపల్ వివరణ

    చండీగఢ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ సుఖ్‌పాల్ కౌర్ మాట్లాడుతూ, స్కూల్ తరఫున సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ధృవీకరించారు.

    పోలీసు స్టేషన్‌లో విద్యార్థులను విచారించినప్పుడు తాను అక్కడే ఉన్నానని, కానీ పోలీసులు ఎవరినీ హింసించలేదని చెప్పారు.

    మౌలిక్‌ను తాను స్టేషన్‌లో చూడలేదని, ఆయన పేరు కూడా ఎవరూ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.

    వివరాలు 

    పోలీసుల వివరణ 

    చండీగఢ్ సైబర్ సెల్ ఎస్పీ గీతాంజలి ఖండేల్వాల్ మాట్లాడుతూ, ఫిర్యాదు వచ్చిన తర్వాత ఐపీ చిరునామాను గుర్తించి దాని ఆధారంగా విద్యార్థులను విచారించినట్లు తెలిపారు.

    విచారణ మొత్తం ఒక సాధారణ హాలులో జరిగింది. అక్కడ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

    ఈ ఘటనలో చండీగఢ్ సైబర్ సెల్‌కు చెందిన ఒక ఏఎస్ఐని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

    బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జోక్యం

    ఈ ఘటనపై చండీగఢ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, పంజాబ్-చండీగఢ్ మానవ హక్కుల కమిషన్ స్పందించాయి. పోలీసులు, స్కూల్ యాజమాన్యం నుంచి వివరణ కోరినట్లు ప్రకటించాయి.

    వివరాలు 

    చట్టపరమైన నిబంధనలు 

    సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ బెయిన్స్ మాట్లాడుతూ, మైనర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిచే బదులుగా, వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని అన్నారు.

    పోలీసుల హింస కఠినంగా ఉంటుందని, వారికి పిల్లల మనస్తత్వం గురించి అవగాహన తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

    జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం

    18 ఏళ్ల లోపు పిల్లలు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయితే, జువెనైల్ జస్టిస్ బోర్డు విచారణ జరుపుతుంది.

    వివరాలు 

    వారిని పోలీస్ లాకప్‌లో ఉంచకూడదు

    విచారణ సమయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండేలా చూడాలి.

    మూడేళ్లకు మించని శిక్ష విధించాల్సిన నేరాల్లో, విచారణ ఆరు నెలల్లోపు పూర్తి కాకపోతే, కేసును మూసివేస్తారు.

    16 ఏళ్లు పైబడిన వారు తీవ్ర నేరాలకు పాల్పడితే, పెద్దవారిగా పరిగణించేందుకు జువెనైల్ బోర్డు నిర్ణయం తీసుకోవచ్చు.

    ఈ ఘటన మైనర్ల హక్కుల పరిరక్షణ, పోలీసుల విచారణ విధానం, స్కూల్ యాజమాన్యాల బాధ్యతల గురించి సమగ్రంగా పరిశీలించేలా చేసింది.

    ఈ కేసు విచారణలో సరైన న్యాయం జరిగేలా చూడాలని మానవ హక్కుల సంఘాలు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, న్యాయవాదులు సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైబర్ నేరం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025