NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: మ‌న సోద‌రీమ‌ణుల సింధూరాన్ని తొల‌గించాల‌ని చూస్తే.. ఉగ్ర‌వాదుల అంతం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లే : మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: మ‌న సోద‌రీమ‌ణుల సింధూరాన్ని తొల‌గించాల‌ని చూస్తే.. ఉగ్ర‌వాదుల అంతం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లే : మోదీ
    మ‌న సోద‌రీమ‌ణుల సింధూరాన్ని తొల‌గించాల‌ని చూస్తే.. ఉగ్ర‌వాదుల అంతం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లే : మోదీ

    PM Modi: మ‌న సోద‌రీమ‌ణుల సింధూరాన్ని తొల‌గించాల‌ని చూస్తే.. ఉగ్ర‌వాదుల అంతం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లే : మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌ను ద్వేషించడం పాకిస్థాన్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు.

    పాకిస్తాన్ ఎప్పుడూ మన దేశానికి హాని చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తుందని చెప్పారు.

    కానీ భారత్ మాత్రం పేదరిక నిర్మూలన,ఆర్థికాభివృద్ధి వంటి శ్రేయస్కరమైన అంశాలపైనే దృష్టి సారిస్తోందని వివరించారు.

    ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ... "మన మహిళల సింధూరాన్ని తొలగించాలనుకునే ఉగ్రవాదులు మట్టికరవాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయి" అని అన్నారు.

    వడోదరలో జరిగిన రోడ్ షో గురించి చెబుతూ,వేలాదిమంది తల్లులు,అక్కాచెల్లెళ్లు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారని తెలిపారు.

    వివరాలు 

    ఆపరేషన్ సిందూర్‌కి ఆశీర్వాదాలు

    భారత సైనిక దళాలు సాధించిన విజయం పట్ల వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు.

    తామంతా తిరంగ ర్యాలీ నిర్వహిస్తూ, ఆపరేషన్ సిందూర్‌కి ఆశీర్వాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.

    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏంచేశారో అందరికీ తెలుసునని మోదీ చెప్పారు.

    "భారతదేశం లేదా నేను మౌనంగా కూర్చుంటామనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు. ఎవరైనా మన మహిళల సింధూరాన్ని లాక్కొవాలనే ఆలోచన వచ్చినా,అటువంటివారిని పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమవుతుందని స్పష్టం చేశారు.

    ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక మిలటరీ ఆపరేషన్ మాత్రమే కాదని, అది భావోద్వేగాలతో కూడుకున్న అంశమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

    "మోదీతో ఉగ్రవాదులు తలపడాలనుకోవడం కలల్లోనైనా ఊహించనిది కావాలి"అని హెచ్చరించారు.

    పెహ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న ఫోటోల‌ను చూస్తుంటే ర‌క్తం మ‌రుగుతోంద‌న్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ

    VIDEO | Dahod, Gujarat: After inaugurating and laying foundation stone of various development projects, Prime Minister Narendra Modi (@narendramodi) says, "I was in Vadodara before coming here, thousands of mothers and sisters had come, they had come to celebrate the Indian armed… pic.twitter.com/QlWaxGPMBG

    — Press Trust of India (@PTI_News) May 26, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    #NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి? ఛత్తీస్‌గఢ్
    Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు విరాట్ కోహ్లీ
    Supreme Court: 'తాగిన తర్వాత మనిషి మృగం అవుతాడు': అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరణ  సుప్రీంకోర్టు
    Sunny Yadav: యూట్యూబ్ స్టార్ సన్నీ యాదవ్ అరెస్ట్..! యూట్యూబ్

    నరేంద్ర మోదీ

    Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్‌ కీలక సమావేశం  రాజ్‌నాథ్ సింగ్
    PM Modi: సీడీఎస్‌, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏలతో ప్రధాని మోదీ కీలక సమావేశం  భారతదేశం
    PM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ .. సీడీఎస్‌, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏల సమావేశంలో ప్రధాని మోదీ భారతదేశం
    Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విజయవాడ వెస్ట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025