NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sheesh Mahal: 'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sheesh Mahal: 'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం! 
    'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం!

    Sheesh Mahal: 'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 10, 2025
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో దిల్లీకి కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. సీఎంను ఎంచుకునే ప్రక్రియను బీజేపీ ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ తరుణంలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

    జాతీయ మీడియా కథనాల ప్రకారం, దిల్లీ కొత్త సీఎం 'శీష్ మహల్' లో నివాసం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

    ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో సివిల్ లైన్స్‌లోని 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు.

    బీజేపీ ఈ బంగ్లాను 'శీష్ మహల్' (అద్దాల మేడ)గా అభివర్ణిస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ దీనిని 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది.

    Details

    బంగ్లా వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయం

    నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ తాను మాత్రం అద్దాల మేడ నిర్మించుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.

    ఆప్ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. భాజపాకు ఘన విజయాన్ని అందించాయి.

    అందుకే విమర్శలకు తావు లేకుండా బీజేపీ కొత్త సీఎం ఈ బంగ్లాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    ఇదిలాఉంటే న్యూదిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌పై పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ తనయుడు పర్వేశ్ వర్మ విజయం సాధించారు.

    ఆయనే సీఎం పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడిన సంగతి తెలిసిందే.

    Details

    మోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత దిల్లీ సీఎం ప్రమాణస్వీకారం

    ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు.

    ప్రధాని మోదీ సోమవారం నుంచి ఫ్రాన్స్, అమెరికాల్లో పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే సీఎం ప్రమాణస్వీకార వేడుకను నిర్వహించాలని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

    మహిళను సీఎంగా చేసే యోచనలో పార్టీ ఉంటే, రేఖా గుప్తా లేదా శిఖా రాయ్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది.

    ఎమ్మెల్యేలను కాకుండా సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిని సీఎంగా నియమించాలని భావిస్తే, తూర్పు దిల్లీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లేదా ఈశాన్య దిల్లీ ఎంపీ మనోజ్ తివారీకి అవకాశం దక్కవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    దిల్లీ
    అమిత్ షా
    నరేంద్ర మోదీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    బీజేపీ

    BJP: జేపీ నడ్డా స్థానంలో ఫిబ్రవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు  భారతదేశం
    PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన నరేంద్ర మోదీ
    Delhi: బంగ్లాదేశ్‌ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్‌.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు  దిల్లీ
    Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు సినిమా

    దిల్లీ

    Delhi Elections: ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ ఎన్నికల సంఘం
    Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు భారతదేశం
    Heavy Snowfall: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 150 విమానాలు, 26 రైళ్లు.. భారతదేశం
    Liquor Policy of Delhi: దిల్లీ మద్యం పాలసీ.. కాగ్ నివేదికలో 2,026 కోట్ల నష్టం అరవింద్ కేజ్రీవాల్

    అమిత్ షా

    JammuKashmir Elections: బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా  జమ్ముకశ్మీర్
    Amit Shah: సైబర్‌ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్‌ షా భారతదేశం
    దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్‌కు అలవాటు: అమిత్ షా  రాహుల్ గాంధీ
    Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇది కొత్త పేరు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    Diamond: 2023లో బైడెన్‌ దంపతులకు మోదీ ఇచ్చిన అత్యంత ఖరీదైన బహుమతి ఏంటో తెలుసా..? జో బైడెన్
    PM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి విశాఖపట్టణం
    Cherlapally Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ భారతదేశం
    Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025