NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Paddy Procurement: మిల్లుల కేటాయింపులో ఆలస్యం, ఇతర పరిణామాల ప్రభావం.. ఆలస్యంగా ధాన్యం కొనుగోళ్లు.. 
    తదుపరి వార్తా కథనం
    Paddy Procurement: మిల్లుల కేటాయింపులో ఆలస్యం, ఇతర పరిణామాల ప్రభావం.. ఆలస్యంగా ధాన్యం కొనుగోళ్లు.. 
    మిల్లుల కేటాయింపులో ఆలస్యం, ఇతర పరిణామాల ప్రభావం.. ఆలస్యంగా ధాన్యం కొనుగోళ్లు..

    Paddy Procurement: మిల్లుల కేటాయింపులో ఆలస్యం, ఇతర పరిణామాల ప్రభావం.. ఆలస్యంగా ధాన్యం కొనుగోళ్లు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 11, 2024
    11:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు రూపొందించిన ప్రణాళికలు అమల్లో ఆలస్యమవుతుండటంతో తెలంగాణ రైతులకు నిరీక్షణ తప్పడం లేదు.

    పౌరసరఫరాల సంస్థ అక్టోబర్ నెలాఖరుకు 8.16 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నవంబరు 9వ తేదీ నాటికి 3,94,460 టన్నులే కొనుగోలు అయ్యాయి.

    కామారెడ్డి జిల్లాలో అక్టోబరులోనే వరి కోతలు ప్రారంభమైనప్పటికీ, కొనుగోళ్లను నవంబర్ 4వ తేదీ నుండి మాత్రమే ప్రారంభించారు.

    ఈ మధ్యలో చాలామంది రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

    వివరాలు 

    ఆ నిబంధనల కారణంగా మిల్లులకు ధాన్యం కేటాయింపు

    అకాల వర్షాల భయం రైతులకు అకాల వర్షాలు భయాన్ని కలిగిస్తున్నాయి. ధాన్యం తడిచినప్పటి స్థితిలో ఆరబెట్టడం ఖరీదైన పని అయింది.

    అలాగే, ధాన్యం కొనుగోలు విధానం ఆలస్యంగా ఖరారు అవడంతో, బ్యాంకు గ్యారంటీ వంటి నిబంధనల కారణంగా మిల్లులకు ధాన్యం కేటాయింపు ఆలస్యమైంది.

    ఈ కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఏర్పడింది. "గ్రెయిన్ కాలిపర్" పరికరాలు సరిపడా లేకపోవడం కూడా ఈ జాప్యానికి దారితీస్తోంది.

    గత సంవత్సరం నవంబర్ 9నాటికి 5,25,742 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సారి మాత్రం 3,94,460 టన్నులే కొన్నారని అధికారులు పేర్కొంటున్నారు.

    అయితే, కేంద్రాలకు వచ్చిన ధాన్యం నిబంధనలకు అనుగుణంగా ఉంటే కొనుగోలులో జాప్యం ఉండదని పౌరసరఫరాల శాఖ తెలిపింది.

    వివరాలు 

    మిల్లర్లకు 10 రోజుల వెసులుబాటు

    కొలిక్కి తెచ్చేలా చర్యలు ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సన్నిహితంగా దృష్టిపెడుతూ, అధికారులు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు.

    మంత్రితో పాటు కమిషనర్ డీఎస్ చౌహాన్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.

    బ్యాంకు గ్యారంటీ నిబంధన విషయంలో మిల్లర్లకు 10 రోజుల వెసులుబాటు ఇచ్చి, అండర్‌టేకింగ్‌ తీసుకున్న తర్వాత ధాన్యం కేటాయింపులు జరుగుతున్నాయి.

    కానీ ఇంకా చాలామంది మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ, అండర్‌టేకింగ్ తీసుకునే స్తితిలో లేరు.

    వివరాలు 

    జిల్లాల్లో పరిస్థితి 

    కామారెడ్డి జిల్లాలో 6.80 లక్షల టన్నుల లక్ష్యంతో 9వ తేదీ నాటికి 83,635 టన్నులు మాత్రమే కొనుగోలు చేసారు.

    నల్గొండ జిల్లాలో సోమవారం నాటికి 1,28,146 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇక్కడ ఎక్కువగా సన్న ధాన్యం మిల్లర్లకు వెళ్లింది.

    యాదాద్రి జిల్లాలో 320 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ, కొనుగోళ్లు మాత్రం సగం పైనే కొనసాగాయి, 59,330 టన్నులు మాత్రమే కొనుగోలు అయ్యాయి.

    సూర్యాపేట జిల్లాలో 4వ తేదీ నుండి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

    మెదక్ జిల్లా వెల్దుర్తి ఉమ్మడి మండలంలో 26 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా,ఎక్కడా ధాన్యం తూకం మొదలవలేదు. ఈ కేంద్రాలకు మిల్లులను కేటాయించకపోవడంతో పరిస్థితి ఇలాగే ఉందని పీఏసీఎస్ సీఈఓ సిద్దయ్య మరియు ఐకేపీ ఇన్‌ఛార్జ్ శంకరయ్య తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    తెలంగాణ

    TG Rains: తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు  ఇండియా
    Telangana: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్ కొట్టివేత హైకోర్టు
    HYDRAA : 'హైడ్రా'కి మరిన్ని అధికారాలు..! ముఖ్యమైన 10 అంశాలు భారతదేశం
    Oil Palm Cultivation: రైతులకు బాగు.. ఆయిల్‌పామ్‌ సాగు.. నల్గొండలో ఆయిల్ ఫ్యాక్టరీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025