NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: గోదావరి - బనకచర్ల అనుసంధానం.. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: గోదావరి - బనకచర్ల అనుసంధానం.. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం
    గోదావరి - బనకచర్ల అనుసంధానం.. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం

    Andhra Pradesh: గోదావరి - బనకచర్ల అనుసంధానం.. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రభావితం చేసే గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ ప్రాజెక్టును దాదాపు ₹70,000-80,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించనున్నారు.

    మూడు నెలల్లో టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ,ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు నిర్వహించారు.

    వ్యాప్కోస్ రూపొందించిన ఆరు ప్రత్యామ్నాయాలను చర్చించి, కేంద్రం నుంచి సాయం పొందడానికి ప్రాథమిక ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.

    చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించి, ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంత ముఖ్యమో వివరించారు.

    పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంత కీలకమో, గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కూడా అంతే ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తున్నారు.

    వివరాలు 

    కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు

    పోలవరంతో వంశధార వరకు అనుసంధానం ఒక ప్రణాళిక కాగా, రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఈ ప్రాజెక్టు ప్రయోజనాలను అందిస్తుంది.

    ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో నీటి సమస్యలు తగ్గిపోతాయని ప్రభుత్వం నిశ్చయంగా భావిస్తోంది.

    ఎగువ ప్రాజెక్టుల ప్రభావంతో కృష్ణానదిలో నీటి కొరత ఉంది. మరోవైపు, గోదావరిలో సగటున ఏటా 2,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి.

    అందులో 280 టీఎంసీల నీటిని వరద కాలంలో మళ్లించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

    ఈ వరద నీరు గోదావరి డెల్టాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు అందజేస్తారు.

    రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఈ వరద కాలంలో 280 టీఎంసీల వరద జలాలను అందించనున్నారు.

    వివరాలు 

    ప్రాజెక్టు మూడు దశల్లో అమలు

    తాజా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలతో చర్చించారు.

    ఇది దేశానికి ఎలా ఉపయోగకరమో వివరించి, కేంద్ర సాయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలనే ప్రణాళిక రూపొందించారు.

    త్వరలోనే ఈ ప్రాజెక్టు కోసం కేంద్రానికి లేఖ రాయనున్నారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు.

    మొదట, పోలవరం నుంచి కృష్ణానదికి గోదావరి వరద నీటిని మళ్లిస్తారు.

    తర్వాత దశలో బొల్లాపల్లి జలాశయాన్ని నిర్మించి నీటిని అందులో నిల్వ చేసి, మూడవ దశలో బొల్లాపల్లి నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తారు.

    దీనిద్వారా గరిష్ఠంగా 345 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

    వివరాలు 

    ప్రత్యామ్నాయం 5డి ప్రకారం... 

    ప్రత్యామ్నాయ ప్రణాళికలో 5డి ప్రకారం, పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచి తాడిపూడి కాలువ సామర్థ్యాన్ని 5,000 క్యూసెక్కులకు పెంచుతారు.

    ఈ నీటిని వైకుంఠపురం వరకు తీసుకెళ్లి అక్కడ బ్యారేజి నిర్మిస్తారు. అక్కడ నుంచి సాగర్ కుడి కాలువను వెడల్పు చేయడంతో పాటు, కొత్త కాలువ నిర్మించి బొల్లాపల్లి జలాశయానికి నీటిని తరలిస్తారు.

    ఈ ప్రాజెక్టులో టన్నెళ్లు, పంపుహౌస్‌లు, గ్రావిటీ కాలువలు అవసరమయ్యే చోట నిర్మిస్తారు.

    ఈ ప్రాజెక్టు రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాల కరవు సమస్యల పరిష్కారానికి కీలకమవుతుంది.

    వివరాలు 

    6 ప్రత్యామ్నాయాలు 

    వ్యాప్కోస్ అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుపై అధ్యయనం నిర్వహించింది.

    ప్రాజెక్టుకు అనువుగా కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించింది. లైడార్ సర్వే కూడా అప్పట్లో పూర్తయింది.

    ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితులకు అనుగుణంగా తిరిగి అధ్యయనం చేయడంతో మొత్తం ఆరు ప్రత్యామ్నాయాలను గుర్తించింది.

    ఈ ప్రత్యామ్నాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఆ చర్చల అనంతరం,వ్యాప్కోస్ జలవనరుల శాఖ అధికారులు,అందులోని రెండు ప్రత్యామ్నాయాలు డిజైన్లకు అనుకూలంగా ఉండటమే కాకుండా అమలుకు సాంకేతికంగా వీలుగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

    ఈ రెండు ప్రత్యామ్నాయాల్లో ఒకటి కృష్ణా నదిలో నీరు కలపకుండా ఉండటం,మరొకటి ఆ నీటిని కృష్ణా నదిలో కలిపి తరలించటానికి అవకాశం కల్పించడం.

    ముఖ్యంగా,ఈ రెండు ప్రత్యామ్నాయాలను ప్రాథమికంగా వీలైనవిగా వ్యాప్కోస్ తన నివేదికలో పేర్కొంది.

    వివరాలు 

    పరిశీలనలో ఉన్న ప్రత్యామ్నాయం 2 ప్రకారం.. 

    పోలవరం జలాశయం నుంచి వరద జలాలను మళ్లిస్తారు. కొత్తగా 25వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా మరో వరద కాలువ తవ్వబడుతుంది.

    ఈ వరద కాలువ, పోలవరం కుడి కాలువతో కలిసి, జలాలను కృష్ణానదిపై వైకుంఠపురం వరకు మళ్లించే విధంగా పని చేస్తుంది.

    కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద అక్విడక్టు నిర్మించి, నీటిని ఆ ప్రాంతం నుంచి సాగర్ కుడి కాలువ ద్వారా మరికొన్ని కొత్త కాలువలు తవ్వి, బొల్లాపల్లి జలాశయానికి తరలిస్తారు.

    200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లాపల్లి వద్ద ఒక పెద్ద జలాశయాన్ని నిర్మిస్తారు.

    అక్కడ నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు నీటిని తరలించేందుకు టన్నెళ్లు తవ్వాలి. వివిధ దశల్లో నీటిని ఎత్తిపోత చేయాల్సి ఉంటుంది.

    వివరాలు 

    ప్రాజెక్టు ముఖ్యాంశాలు 

    నాలుగు ప్రాంతాల్లో టన్నెళ్లు తవ్వాలి.

    ఎనిమిది చోట్ల పంపుహౌస్‌లు నిర్మించాలి.

    మధ్యలో గ్రావిటీ కాలువ సౌకర్యం కూడా ఉంటుంది.

    ప్రాజెక్టు ద్వారా 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందిస్తుంది.

    22.5 లక్షల ఎకరాలకు నీటి నిల్వ స్థిరీకరణ ఉంటుంది. 80 లక్షల మందికి తాగునీటి సదుపాయం అందించబడుతుంది.

    పరిశ్రమలకు 20 టీఎంసీల నీటి అవసరం తీర్చబడుతుంది.

    రోజుకు 2-3 టీఎంసీల గోదావరి వరద జలాలను మళ్లిస్తారు.

    54 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది.

    ఇందులో కొంతమేర అటవీభూమి కూడా ఉంది.

    ప్రాజెక్టు అమలు కోసం 4 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం.

    ఈ ప్రాజెక్టు మౌలిక సదుపాయాలు, భవిష్యత్ నీటి అవసరాలు తీర్చేందుకు విస్తృత ప్రయోజనాలు అందించగలగాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Paper Leak: సమ్మెటివ్‌-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు లీక్‌.. 6-10 తరగతుల గణిత పరీక్షలు రద్దు భారతదేశం
    AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ  భారతదేశం
    AP Tourism Policy 2024-2029: ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు జనసేన
    Daikin: ఏపీలో జపాన్‌కు చెందిన డైకిన్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025