NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu:ఏపీ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu:ఏపీ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత  
    ఏపీ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత

    CM Chandrababu:ఏపీ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్ర బడ్జెట్ తయారీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

    కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

    2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2.94 లక్షల కోట్లతో ప్రభుత్వం గతంలో 5 నెలల బడ్జెట్‌ను నవంబర్‌లో ప్రవేశపెట్టింది.

    అయితే, ఈ నెల 24నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానుండగా, 28వ తేదీన బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకురావచ్చనే అవకాశముంది.

    ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.

    వివరాలు 

    2025-26 బడ్జెట్ - సూపర్ సిక్స్ పథకాల ప్రాధాన్యత 

    రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 2025-26 పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

    ముఖ్యంగా, సూపర్ సిక్స్ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.

    ఇప్పటికే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

    మరోవైపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి తెలియజేసి, అదనపు ఆర్థిక సహాయాన్ని కోరిన సీఎం చంద్రబాబు, ఉచిత ఇసుక విధానంతో రాష్ట్ర ఆదాయం తగ్గినట్లు స్పష్టం చేశారు.

    ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్ల పెంపుతో నెలకు రూ. 2720 కోట్ల వ్యయం జరుగుతోంది.

    దీపం-2, అన్న క్యాంటీన్లు వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ వ్యయ భారం మరింత పెరిగింది.

    వివరాలు 

    ఆర్థిక స్థిరత్వానికి సవాల్ - అభివృద్ధి & సంక్షేమానికి సమతుల్యత 

    ఈ ఏడాదిలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

    'తల్లికి వందనం', 'అన్నదాత', ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రారంభించనున్నారు.

    ఈ నేపథ్యంలో, ప్రభుత్వ వ్యయం పెరుగుతున్నప్పటికీ, అభివృద్ధి పనులను కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది.

    అటు పోలవరం,అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం అందడంతో కొంత ఊరట లభించింది.

    అయితే, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా మరిన్ని నిధులు అవసరమని భావించిన సీఎం చంద్రబాబు, 16వ ఆర్థిక సంఘాన్ని ప్రత్యేక సాయం మంజూరు చేయాలని కోరారు.

    ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడమే కాక, అభివృద్ధి కార్యక్రమాలను సమతుల్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ రూపకల్పనపై సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: అమరావతిలో మరో రూ.2,723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం భారతదేశం
    Chandrababu: దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు దిల్లీ
    Chandrababu: ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ నరేంద్ర మోదీ
    CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025