NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CAA: CAA అమలు వేగవంతం చేసిన కేంద్రం.. మూడు రాష్ట్రాల్ల లబ్ధిదారులకు భారత పౌరసత్వం 
    తదుపరి వార్తా కథనం
    CAA: CAA అమలు వేగవంతం చేసిన కేంద్రం.. మూడు రాష్ట్రాల్ల లబ్ధిదారులకు భారత పౌరసత్వం 
    CAA అమలు వేగవంతం చేసిన కేంద్రం.. మూడు రాష్ట్రాల్ల లబ్ధిదారులకు భారత పౌరసత్వం

    CAA: CAA అమలు వేగవంతం చేసిన కేంద్రం.. మూడు రాష్ట్రాల్ల లబ్ధిదారులకు భారత పౌరసత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2024
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్‌లలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కింద కేంద్ర ప్రభుత్వం బుధవారం పౌరసత్వం మంజూరు చేయడం ప్రారంభించింది.

    ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. మూడు రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు సంబంధిత రాష్ట్ర సాధికార కమిటీ పౌరసత్వం మంజూరు చేసిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    అయితే ఎంత మందికి పౌరసత్వం లభించిందన్న సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

    అంతకుముందు మే 15న,CAA కింద తొలిసారిగా 14మందికి భారత పౌరసత్వం లభించింది.

    కేంద్ర ప్రభుత్వం మార్చి 11న దేశవ్యాప్తంగా CAAని అమలు చేసింది.

    CAA ప్రకారం,డిసెంబర్ 31, 2014కంటే ముందు పాకిస్థాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి ఒక నిబంధన ఉంది.

    Details

    శరణార్థులకు పౌరసత్వం లభించడం పట్ల షా సంతోషం 

    పౌరసత్వ సవరణ బిల్లు(CAB)10 డిసెంబర్ 2019న లోక్‌సభ, మరుసటి రోజు రాజ్యసభ ఆమోదించింది. 12 డిసెంబర్ 2019న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం పొందిన తర్వాత CAA చట్టంగా మారింది.

    మమతా బెనర్జీతో సహా దేశంలోని చాలా మంది ప్రతిపక్ష నాయకులు సీఏఏను నిరంతరం వ్యతిరేకిస్తున్నారు.

    ఏప్రిల్‌లో, మమత CAAని మానవత్వానికి అవమానంగా, దేశం ప్రాథమిక సూత్రాలకు ముప్పు అని పేర్కొన్నారు. బెంగాల్‌లో సీఏఏ అమలుకు ఎప్పటికీ అనుమతించబోమని ఆమె అన్నారు.

    తొలిసారిగా 14మందికి భారత పౌరసత్వం లభించినందుకు హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సంతోషం వ్యక్తం చేశారు.

    ఈరోజు చారిత్రాత్మకమైన రోజని ఆయన అన్నారు.ప్రతి శరణార్థికి CAA కింద పౌరసత్వం ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025