NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Investments: రూ.31,617 కోట్లతో రాష్ట్రంలో 32,633 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Investments: రూ.31,617 కోట్లతో రాష్ట్రంలో 32,633 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
    రూ.31,617 కోట్లతో రాష్ట్రంలో 32,633 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!

    Investments: రూ.31,617 కోట్లతో రాష్ట్రంలో 32,633 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 11, 2025
    11:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా రూ.31,617 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 32,633 మందికి ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి.

    ఆహారశుద్ధి, ఐటీ, ఇంధనం, ఇన్‌ఫ్రా అండ్‌ కమ్యూనికేషన్ (ఐ అండ్‌ సీ) రంగాల్లో మొత్తం 16 కంపెనీలు తమ పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు సమర్పించగా, వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఆమోదించారు.

    Details

    టీసీఎస్‌ విస్తరణ - విశాఖలో భారీ కేంద్రం 

    విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) రూ.1,370 కోట్లతో ఒక కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ప్రకటించగా, ఈ ప్రతిపాదనకు SIPB సమావేశంలో ఆమోదం లభించింది. ఈ కేంద్రం ద్వారా 12,000 మందికి ఉపాధి లభించనుంది.

    ప్రముఖ సంస్థల పెట్టుబడులు

    ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ : రూ.4,200 కోట్ల పెట్టుబడి

    మా మహామాయ ఇండస్ట్రీస్‌ : రూ.2,063 కోట్ల పెట్టుబడి

    ఈ రెండు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది.

    Details

    10 నెలల్లోనే 5 సమావేశాలు

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ఇప్పటివరకు మొత్తం 5 SIPB సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రూ.4,71,379 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం లభించింది.

    వీటి ద్వారా మొత్తం 4,17,188 మందికి ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉంది.

    ఇది గత పాలనతో పోలిస్తే విశేషమైన పురోగతిగా కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం ఐదు SIPB సమావేశాలే నిర్వహించగా, కూటమి ప్రభుత్వం కేవలం 10 నెలల్లోనే అంతే సంఖ్యలో సమావేశాలు నిర్వహించడం గమనార్హం.

    Details

    ఐటీ కంపెనీలకు భూకేటాయింపుపై లోకేశ్ సూచన 

    ఈ సమావేశంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతూ, ఐటీ సంస్థలకు నామమాత్రపు ధరలకు భూములు కేటాయించాలని సూచించారు.

    తక్కువ ధరలకు భూములు లభిస్తే, రాష్ట్రానికి మరిన్ని ఐటీ కంపెనీలు రావడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

    ముఖ్యమంత్రి ఈ సూచనపై సానుకూలంగా స్పందించారు. ఐటీ విధానాన్ని సవరించి, దీనికి అనుగుణంగా కొత్త ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

    Details

    ఉత్పత్తి ప్రారంభ వేళపై స్పష్టత అవసరం: సీఎం 

    పెట్టుబడులు రాష్ట్రానికి రావడమే కాదు, అవి గల కార్యరూపం దాల్చడం కూడా అంతే అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

    పరిశ్రమలు తమ ప్రాజెక్టులను నిర్ణయించిన సమయానికి ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

    ప్రతి ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే సమయంలోనే ఉత్పత్తి ప్రారంభించే తుది తేదీ స్పష్టంగా తీసుకోవాలని సూచించారు.

    అనంతరం దశలవారీగా ప్రాజెక్ట్ పురోగతిని పర్యవేక్షిస్తూ, తదుపరి SIPB సమావేశానికి విస్తృత నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

    ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయో, వాటి ద్వారా ఎంతమంది ఉద్యోగాలు పొందారో తదితర వివరాలతో కూడిన పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.

    ప్రతి సంస్థ ఎవరికెవరికీ ఉద్యోగం కల్పించిందన్న వివరాలు కూడా అందుబాటులో ఉండాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు
    నారా లోకేశ్

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    ఆంధ్రప్రదేశ్

    Amaravati: ఏపీ అమరావతిలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం భారతదేశం
    Kesineni Chinni: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై ఏసీఏ అధ్యక్షుడు వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ భారతదేశం
    YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Rishikonda Beach: బ్లూఫ్లాగ్ గుర్తింపు సాధించిన రుషికొండ బీచ్.. మంత్రి దుర్గేష్ హర్షం భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: సైన్స్ కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు చేయవచ్చు.. వైద్య ఖర్చులు తగ్గాలన్న సీఎం చంద్రబాబు.. భారతదేశం
    CM Chandrababu:ఏపీ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత   భారతదేశం
    AP Budget: 28న రాష్ట్ర బడ్జెట్‌.. సూపర్‌సిక్స్‌ హామీల అమలుకు ప్రత్యేక కేటాయింపులు భారతదేశం
    Chandrababu: ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌.. ప్రతి బస్సులో క్యూఆర్‌ కోడ్‌ భారతదేశం

    నారా లోకేశ్

    Nara Lokesh : జగన్ సిద్ధం సభలో లో 'గ్రాఫిక్స్ జనం': నారా లోకేష్  భారతదేశం
    Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు  చంద్రబాబు నాయుడు
    Nara Lokesh: జనానికి అందుబాటులో లోకేష్.. గతానికి భిన్నంగా పని తీరు భారతదేశం
    Nara Lokesh: ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.. మెగా డీఎస్సీ ఫైలుపై తోలి సంతకం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025