NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం .. నీటిమట్టం 818.20 అడుగులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం .. నీటిమట్టం 818.20 అడుగులు
    శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం .. నీటిమట్టం 818.20 అడుగులు

    Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం .. నీటిమట్టం 818.20 అడుగులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2025
    10:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో వరద నీరు ప్రవహిస్తోంది.

    ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, 'సుంకేశుల జలాశయం నుంచి 8,824క్యూసెక్కుల నీరు,జూరాల ప్రాజెక్టు నుంచి 88,835క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది'.

    శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 818.20అడుగులకు చేరింది. అలాగే నీటి నిల్వ 39.5529 టీఎంసీలుగా నమోదైందని చెప్పారు.

    ప్రతి సంవత్సరం జూన్‌ నెల తర్వాతే శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరేది.అయితే ఈసారి మే నెల నుంచే వరద ప్రవాహం మొదలవడం విశేషం.

    ఇటీవలి కాలంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంగా వరద నీరు ముందుగానే చేరుతుందని అధికారులు పేర్కొన్నారు.

    వివరాలు 

    ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు 

    ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

    రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

    రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పరిస్థితిపై కూడా వారు స్పష్టతనిచ్చారు.

    ఈ వాయుగుండం గురువారం మధ్యాహ్నానికి పశ్చిమ బెంగాల్.. బంగ్లాదేశ్ తీర ప్రాంతాలకు సమీపంగా చేరి తీవ్ర వాయుగుండంగా మారినట్లు తెలిపారు.

    అదే రోజు సాయంత్రం నాటికి ఈ వాయుగుండం బలహీనపడినట్లు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖెపుపరా మధ్య ప్రాంతాన్ని దాటి వెళ్లినట్లు పేర్కొన్నారు.

    వివరాలు 

    ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాల ప్రభావం  

    ఈ వాయుగుండం ప్రభావం ఏపీ రాష్ట్రంపై పడలేదని స్పష్టం చేశారు.

    ఈ పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వాటి ప్రభావంగా వర్షాలు పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

    ఈ రోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

    వివరాలు 

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇక మరోవైపు హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సూచనల మేరకు, జిల్లాల్లోని నదీ తీరాలు, చెరువులు, సరస్సులు, కాలువల వంటి నీటి వనరుల్లో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

    ఈ హెచ్చరిక బోర్డులపై భద్రతకు సంబంధించిన సూచనలు, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లు వుంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీశైలం

    తాజా

    Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం .. నీటిమట్టం 818.20 అడుగులు శ్రీశైలం
    Kannappa: 'కన్నప్ప' విడుదలకు 28 రోజులు మాత్రమే మిగిలిఉంది: మంచు విష్ణు కౌంట్‌ డౌన్‌ పోస్ట్‌ కన్నప్ప
    New York: న్యూయార్క్‌ వాల్‌స్ట్రీట్‌ను ఊపేసిన భారతీయ పెళ్లి బరాత్‌ న్యూయార్క్
    Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800  స్టాక్ మార్కెట్

    శ్రీశైలం

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం ఆంధ్రప్రదేశ్
    Srisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్‌ 22 గేట్ల ద్వారా నీటి విడుదల   భారతదేశం
    Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక రాష్ట్రం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025