NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    #Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి 
    భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి

    #Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 02, 2024
    09:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైంది.

    రాష్ట్రవ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో 20 సెంటీమీటర్లకంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వగా, ఈ ప్రకృతి విపత్తు కారణంగా 9 మంది ప్రాణాలను విడిచారు.

    ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు బారిన పడిన 294 గ్రామాల నుంచి 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

    వీరి రక్షణకై పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), ఎస్డీఆర్‌ఎఫ్‌ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు పనిచేసి 600 మందిని రక్షించాయి.

    Details

    30 ఏళ్లలో విజయవాడలో ఎన్నడూ లేనంత వర్షపాతం 

    బాధితుల కోసం ప్రభుత్వం 25 కిలోల బియ్యం, ఒక్కో కిలో చొప్పున నిత్యావసరాలను అందజేస్తోంది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల బియ్యం ఇస్తున్నామని ప్రకటించారు.

    విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతంగా వర్షం కురిసింది. ఓకే రోజు 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించింది.

    దీంతో ఆ నీరంతా సమీప కాలనీకు చేరింది. పట్టణ పరిధిలోని అత్యధిక శాతం జలదిగ్భధంలో చిక్కుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

    Details

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : చిరంజీవి

    రోడ్లపై పడవలు వేసుకొని తిరిగాల్సి వచ్చిందంటే విజయవాడలో ఎంతదారుణమైన పరిస్థితి నెలకొందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    ఇక రైల్వే పట్టాలపై నీరు చేయడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

    జాతీయ రహాదారిపై వరదనీరు భారీగా చేరడంతో విజయవాడ-హైదరాబాద్ మార్గాల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

    కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో కూడా భారీ నష్టం సంభవించింది. భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది.

    ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

    వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు చిరంజీవి ప్రజలకు సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    భారీ వర్షాలు

    తాజా

    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్

    Kemburi Rammohan Rao: మాజీ ఎంపీ కెంబూరి కన్నుమూత తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Rowdy Sheeter Murder: పాతబస్తీలో రౌడీషీటర్‌ను కాల్చి చంపిన దుండగలు హైదరాబాద్
    Anitha: ఏపీ హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం హోంశాఖ మంత్రి
    Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి టైం ఫిక్స్ ..ప్రకటించిన  మంత్రి నారాయణ   భారతదేశం

    భారీ వర్షాలు

    న్యూయార్క్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిపోయిన జనజీవనం.. ఎమర్జెన్సీ విధింపు అమెరికా
    సిక్కింలో వరద బీభత్సం.. 19కి చేరిన మరణాలు, 103 గల్లంతు  సిక్కిం
    సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు  సిక్కిం
    కేరళ వర్షాలు: నేడు పాఠశాలలు,కళాశాలలు మూసివేత కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025