NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Himanta Sarma: మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై దుమారం.. ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Himanta Sarma: మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై దుమారం.. ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 
    మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై దుమారం.. ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

    Himanta Sarma: మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై దుమారం.. ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2025
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

    బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తాము రక్షకులమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

    ఆయన వ్యాఖ్యలను భారత నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

    అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ వ్యాఖ్యలను "ప్రమాదకరమైనవి" అని మండిపడగా, కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు నేపధ్యంలో ఈశాన్య రాష్ట్రాల పరంగా కేంద్ర విదేశాంగ ఏవిధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది.

    వివరాలు 

    పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి భూభాగంలో చికెన్స్ నెక్‌ కారిడార్‌

    ''యూనస్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. అవి పూర్తిగా ఖండించదగినవి.భారత వ్యూహాత్మక కారిడార్,చికెన్స్ నెక్‌ కారిడార్‌ (Chicken's Neck Corridor)తో ముడిపడి ఉన్న అంశాలే ఆయన వ్యాఖ్యలకు కారణం. ఈ కారిడార్ పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి భూభాగంలో ఉంది.ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో ఈ కారిడార్ కలుపుతోంది. చుట్టూ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌ విస్తరించి ఉన్నాయి. గతంలోనూ, భారత ప్రధానం,ఈశాన్య ప్రాంతాన్ని విడదీసే ప్రయత్నాలు స్వదేశంలోనే వ్యతిరేక శక్తులు చేశాయి.

    వివరాలు 

    యూనస్ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలను తేలిగ్గా తీసుకోవద్దు

    అందుకే, ఈ కారిడార్ చుట్టూ సమర్థవంతమైన రైల్వే, రోడ్డు నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయడం అత్యంత అవసరం. ఇంకా, చికెన్స్ నెక్‌ను బైపాస్ చేసేలా రెండు భూభాగాలను అనుసంధానించే ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, దీని కోసం ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే, సంకల్పం,ఆవిష్కరణలతో ఆ దిశగా విజయాన్ని సాధించవచ్చు. యూనస్ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలను తేలిగ్గా తీసుకోవద్దు. అవి వారి దీర్ఘకాలిక వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయి'' అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.

    వివరాలు 

    పవన్ ఖేడా కూడా ఆందోళన

    ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా కూడా ఆందోళన వ్యక్తంచేశారు.

    ''బంగ్లాదేశ్‌ అనుసరిస్తోన్న విధానం మన ఈశాన్య ప్రాంతానికి తీవ్రమైన ముప్పుగా కనిపిస్తోంది.మన ప్రభుత్వం మణిపూర్‌ను పట్టించుకోవడం లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించింది. తమ దేశం(బంగ్లాదేశ్‌)నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మనలను చుట్టుముట్టాలని బంగ్లా ప్రయత్నిస్తోంది.అలాంటి పరిస్థితుల్లో మన విదేశాంగ విధానం దయనీయంగా కనిపిస్తోంది'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇక బంగ్లాలో హైకమిషనర్‌గా పనిచేసిన వీణా సిక్రీ యూనస్ వ్యాఖ్యలను ఖండించారు.

    ''ఇవి దిగ్భ్రాంతికరమైనవి.ఈ విధంగా మాట్లాడటానికి యూనస్‌కు ఏమాత్రం హక్కు లేదు.ఈశాన్య ప్రాంతం భారతదేశంలో భాగమని ఆయనకు తెలుసు.ఈశాన్యభారతం ద్వారా బంగాళాఖాతంలోకి ప్రవేశించడంపై బంగ్లాతో అధికారిక ఒప్పందాలు ఉన్నాయి''అని ఆమె స్పష్టంచేశారు.

    వివరాలు 

    డోక్లాం ప్రాంతం తమదేనన్న చైనా

    పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతంలో కొంతభాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది.

    ఇది నేపాల్,భూటాన్,బంగ్లాదేశ్‌లకు దగ్గరగా ఉంది.చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది.

    ఈ ప్రాంతంపై దాడి చేసి భారత్ నుండి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు గత కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు.

    ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్‌ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్‌ అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి.

    డోక్లాం ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది. ఈ విషయమై 2017లో భారత్-చైనా మధ్య 72 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమంత బిస్వా శర్మ

    తాజా

    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్

    హిమంత బిస్వా శర్మ

    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ అదానీ గ్రూప్
    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత అస్సాం/అసోం
    కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎంకు ఓవైసీ స్ట్రాంగ్ రిప్లే అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025