Page Loader
Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత 
'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత

Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత 

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ బ్రాండ్ కరాచీ బేకరీ గురించి ప్రస్తుతం ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఈ బ్రాండ్ పేరు "కరాచీ"గా ఉండటం వల్ల ఇది పాకిస్తాన్‌కు చెందినదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కరాచీ అనేది పాకిస్థాన్‌లోని ఒక ప్రముఖ నగరం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజలలో స్పష్టత కల్పించాలనే ఉద్దేశంతో కరాచీ బేకరీ యజమానులు ఒక అధికారిక ప్రకటన చేశారు. తమ బ్రాండ్ పుట్టుక భారతదేశంలోనే జరిగిందని,పూర్తి స్థాయిలో ఇది భారతీయ సంస్థే అని వారు పేర్కొన్నారు.

వివరాలు 

 ఊరి పేరు జ్ఞాపకార్థంగా "కరాచీ బేకరీ" 

ఈప్రకారం,తమ బేకరీ మొదటిసారిగా 1953లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్థాపించినట్లు వారు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. కరాచీ అనే పేరు చరిత్ర సంబంధిత నేపథ్యంలో తీసుకున్నప్పటికీ, సంస్థకు పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. సంస్థ యజమానులు రాజేష్, హరీష్ రామ్నానీలు తెలిపిన ప్రకారం, వారి తాతగారు ఖాన్చంద్ రామ్నానీ భారతదేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లోని కరాచీ నుండి భారత్‌కు వచ్చి, హైదరాబాద్‌లో స్థిరపడి బేకరీను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆ ఊరి పేరు జ్ఞాపకార్థంగా "కరాచీ బేకరీ" అని పేరు పెట్టారని తెలిపారు.

వివరాలు 

కేవలం బేకరీ పేరులో "కరాచీ" అనే పదం.. ఉండడం వల్ల..

దాదాపు 73 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థపై ఇటీవల కొన్ని ప్రాంతాల్లో దాడులు జరగడం యజమానులను ఆందోళనకు గురిచేసింది. కేవలం బేకరీ పేరులో "కరాచీ" అనే పదం ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని వారి వ్యాపారానికి భద్రత కల్పించాలని కోరుతూ వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డీజీపీని, పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. ఇటీవల విశాఖపట్టణంలో కూడా తమ బేకరీపై ఇలాంటి సంఘటన చోటుచేసుకున్నదని యజమానులు వెల్లడించారు. ఈ తరహా ఘటనల నేపథ్యంలో బేకరీ పేరును మార్చుకోవాలన్న కొందరి సూచనలపై స్పందిస్తూ, తమకు మద్దతుగా నిలవాలని ప్రజలను, ప్రభుత్వాధికారులను యజమానులు కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు