NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో  కూరగాయల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో  కూరగాయల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ
    దిల్లీలో ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ

    Rahul Gandhi: దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో  కూరగాయల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ

    వ్రాసిన వారు Stalin
    Aug 01, 2023
    01:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైతులు, కార్ మెకానిక్‌లతో సమావేశమై అందరినీ ఆశ్చర్య పరిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కూరగాయల వ్యాపారులను కలిశారు.

    ఇందుకోసం రాహుల్ గాంధీ మంగళవారం తెల్లవారుజామున దిల్లీలోని ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌ అయిన ఆజాద్‌పూర్ మండికి వెళ్లారు. అక్కడ కూరగాయల వ్యాపారులతో మాట్లాడారు.

    రాహుల్ గాంధీ కూరగాయల మార్కెట్ వద్దకు చేరుకోగానే అక్కడున్న జనం ఒక్కసారిగా గుమిగూడారు. రాహుల్ గాంధీ మార్కెట్‌లో కూరగాయల ధరలపై ఆరా తీశారు.

    ఇదిలా ఉంటే, శనివారం రాహుల్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల వ్యాపారి కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను షేర్ చేశారు.

    టమాట సహా కూరగాయల ధరలు పెరగడం వల్ల రోజుకు రూ.100కూడా సంపాదించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

    దిల్లీ

    గత రెండు నెలల్లో రాహుల్ సామాన్యులను కలవడం ఇది మూడోసారి

    ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల మార్కట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న వ్యాపారి వీడియోను షేర్ చేసిన అనంతరం రాహుల్ గాంధీ ఆ మార్కెట్‌కు వెళ్లడం గమనార్హం.

    అంతకుముందు రాహుల్ హర్యానాలోని సోనిపట్‌లో రైతులతో సమావేశమయ్యారు. అతను స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఫోటోలను షేర్ చేశారు.

    అందులో అతను పొలాల్లో పని చేస్తూ, ట్రాక్టర్లు నడుపుతూ, రైతులతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. వారితో భోజనం కూడా చేశారు.

    ఆ తర్వాత దిల్లీలోని కరోల్ బాగ్‌లో మోటార్ మెకానిక్స్‌ను కూడా రాహుల్ కలిశారు.

    గత రెండు నెలల్లో రాహుల్ సామాన్యుల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడడం ఇది మూడోసారి. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లి సామాన్య ప్రజలతో మాట్లాడారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     దిల్లీ కూరగాయల మార్కెట్‌లో రాహుల్ గాంధీ

    जननायक राहुल गांधी जी आज दिल्ली की आजादपुर मंडी में सब्जी और फल विक्रेताओं से मिले।

    राहुल जी ने उनकी समस्याओं को जाना और समझा।

    भारत जोड़ो यात्रा जारी है... 🇮🇳 pic.twitter.com/g0PuMD3tEi

    — Congress (@INCIndia) August 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్
    తాజా వార్తలు
    దిల్లీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రాహుల్ గాంధీ

    ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు హర్యానా
    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ కాంగ్రెస్
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా సూరత్
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే? గుజరాత్

    కాంగ్రెస్

    కాంగ్రెస్ యోగా డే ట్వీట్; ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు తాజా వార్తలు
    బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం బిహార్
    పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా? పాట్న
    'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు అశోక్ గెహ్లాట్
    Naked woman: కాలిఫోర్నియాలో మహిళ రచ్చ; బట్టలిప్పి నడిరొడ్డపై తుపాకీతో హల్‌చల్  కాలిఫోర్నియా
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    కర్ణాటక: బురఖా ధరించలేదని బస్సు ఎక్కనివ్వని ఆర్టీసీ డ్రైవర్ కర్ణాటక

    దిల్లీ

    ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా.. వరదలపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష   వరదలు
    ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్ వర్షాకాలం
    Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి  బస్సు ప్రమాదం
    'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్‌లో దిల్లీ పోలీసులు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025