NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kejriwal: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే హరియాణా ప్రభుత్వం కుట్రలు: కేజ్రీవాల్‌ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kejriwal: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే హరియాణా ప్రభుత్వం కుట్రలు: కేజ్రీవాల్‌ 
    దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే హరియాణా ప్రభుత్వం కుట్రలు: కేజ్రీవాల్‌

    Kejriwal: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే హరియాణా ప్రభుత్వం కుట్రలు: కేజ్రీవాల్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    02:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    త్వరలో జరిగే దిల్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో హర్యానా ముఖ్యమంత్రి తనపై కుట్ర చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

    ఈ కుట్రలో భాగంగానే ఎన్నికల సంఘం (EC) తనకు నోటీసులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు.

    యమునా నది నీరు విషపూరితమని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఎన్నికల సంఘం అతనికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

    ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశించడంతో, కేజ్రీవాల్ ఈ రోజు ఎన్నికల కమిషన్ ముందు హాజరయ్యారు.

    వివరాలు 

    దిల్లీలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మూత

    దిల్లీకి ప్రవహించే యమునా నదిలో అమ్మోనియం స్థాయులు సాధారణం కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని, దీనిపై దిల్లీ సీఎం ఆతిశీ (Atishi)హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini)కు అనేకసార్లు ఫిర్యాదు చేసినట్లు కేజ్రీవాల్ తెలిపారు.

    నీటిలో అమ్మోనియం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, లేదా అదనపు నీటిని విడుదల చేయాలని కోరినప్పటికీ,సైనీ ముందుగా అంగీకరించినా తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

    ఈ కారణంగా దిల్లీలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఒకటి తర్వాత ఒకటి మూతపడినట్లు తెలిపారు.

    ఈ సమస్యపై దిల్లీ చీఫ్ సెక్రటరీ, హరియాణా చీఫ్ సెక్రటరీలతో సంప్రదించగా, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించాల్సిన అవసరం ఉందని సూచించారని చెప్పారు.

    వివరాలు 

    మా పోరాటం ఫలితంగా నీటిలో అమ్మోనియం స్థాయి 2.1కి తగ్గింది

    ఈ పరిణామాలు చూస్తే, ఇది ఎన్నికలను ప్రభావితం చేసేందుకు భాజపా (BJP) చేయించిన కుట్రగా తాను భావిస్తున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

    "జనవరి 15 తర్వాత విచిత్రంగా నీటిలో అమ్మోనియం స్థాయిలు అధికమయ్యాయి. దానికి మమ్మల్ని బాధ్యులను చేయాలనే కుట్ర జరుగుతుందనే అనుమానం ఆతిశీ వ్యక్తం చేయడంతో, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. మేము పోరాడిన ఫలితంగా ప్రస్తుతం నీటిలో అమ్మోనియం స్థాయి 2.1కి తగ్గింది. దీన్ని బట్టి హరియాణా ప్రభుత్వ ప్రమేయం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది" అని ఆయన తెలిపారు.

    వివరాలు 

    ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం 

    ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ప్రవర్తన వల్ల ప్రజల్లో ఎన్నికల సంఘంపై ఉన్న విశ్వాసం పూర్తిగా నశించిందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.

    భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించిన సంస్థగా ఎన్నికల సంఘం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

    భాజపా చేస్తున్న అవినీతి, అక్రమాలను పట్టించుకోకుండా, ప్రతిపక్షాలను కేవలం లక్ష్యంగా చేసుకుంటున్న ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తీవ్రంగా విమర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    అరవింద్ కేజ్రీవాల్

    Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..? దిల్లీ
    Delhi next CM : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తదుపరి సీఎం ఎవరు?  దిల్లీ
    AAP: దిల్లీ ముందస్తు ఎన్నికలకు ఆప్‌ డిమాండ్‌.. ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..! ఎన్నికల సంఘం
    Arvind Kejriwal: రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025