NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్‌ నుంచి ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్‌ నుంచి ప్రారంభం
    నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్‌ నుంచి ప్రారంభం

    National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్‌ నుంచి ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 14, 2025
    10:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇవాళ జాతీయ పసుపు బోర్డు మొదలుకానుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డు‌ను వర్చువల్‌ రూపంలో ప్రారంభించనున్నారు.

    జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరవుతారు.

    నిజామాబాద్‌ జిల్లా ఇందూరులో ఈ పసుపు బోర్డు ఏర్పాటవుతుంది. ప్రస్తుతం ఉన్న రీజినల్ స్పైసెస్ బోర్డు కార్యాలయంలోనే ఇవాళ్టి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు యథావిథిగా కొనసాగనున్నాయి.

    ఇకపోతే సోమవారం సాయంత్రం దిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్రం శుభవార్తను అందించింది.

    Details

    ప్రజల తరుపున మోదీకి కృతజ్ఞతలు

    మంగళవారం నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు.

    పసుపు బోర్డు కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.

    ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, గ్రామీణ సంస్కృతికి ప్రతీక అని కిషన్‌రెడ్డి అన్నారు.

    ఈ ఏడాది తొలిసారి తన నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, స్పీకర్ ఓంబిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కవులు, కళాకారులు పాల్గొన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిజామాబాద్
    నరేంద్ర మోదీ
    కిషన్ రెడ్డి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నిజామాబాద్

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి హైదరాబాద్
    నిజామాబాద్‌: మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య భారతదేశం
    నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ  ఎన్ఐఏ

    నరేంద్ర మోదీ

    PM Modi: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మోదీ, అమిత్‌ షా శుభాకాంక్షలు అమిత్ షా
    Pan Card 2.0: పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు! పాన్ కార్డు
    Pm modi: ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. 34 ఏళ్ల మహిళ అరెస్ట్ భారతదేశం
    PM Modi: వైరల్‌గా మారిన ప్రధాని మోదీ భద్రతలో మహిళా కమాండో ఫొటో.. అసలు విషయం ఏంటంటే..? భారతదేశం

    కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ బీజేపీ
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి వరంగల్ తూర్పు
    KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025