NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Pakistan: జెఇఎమ్ వంటి గ్రూపుల ద్వారా పాకిస్థాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు మేము బాధితులం: భారత్‌
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: జెఇఎమ్ వంటి గ్రూపుల ద్వారా పాకిస్థాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు మేము బాధితులం: భారత్‌
    జెఇఎమ్ వంటి గ్రూపుల ద్వారా పాకిస్థాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు మేము బాధితులం: భారత్‌

    India-Pakistan: జెఇఎమ్ వంటి గ్రూపుల ద్వారా పాకిస్థాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు మేము బాధితులం: భారత్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2025
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విమర్శలు చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది.

    ప్రతిసారీ భారతదేశంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నా, మనం గట్టిగా సమాధానం ఇచ్చినప్పటికీ వారి ప్రవర్తన మారడం లేదు.

    తాజాగా మరోసారి పాకిస్థాన్ చేసిన నిరాధార ఆరోపణలను భారత్‌ ఖండించింది.

    ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాక్‌ నిలుస్తోందని, అయితే తాము దాని బారిన పడుతున్న బాధితులమని భారత్‌ స్పష్టం చేసింది.

    జైషే మహమ్మద్ వంటి తీవ్రవాద సంస్థలను ప్రోత్సహించే పాకిస్తాన్, తమను ఉగ్రవాద వ్యతిరేక దేశంగా ప్రకటించుకోవడం అత్యంత హాస్యాస్పదమని తీవ్రంగా స్పందించింది.

    వివరాలు 

    పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన భారత శాశ్వత ప్రతినిధి

    చైనా అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో, జమ్ముకశ్మీర్‌పై పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ వ్యాఖ్యలు చేశారు.

    భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్ ఘాటుగా స్పందించారు. ''పాకిస్తాన్‌లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న 20 తీవ్రవాద సంస్థలు ప్రోత్సాహం పొందుతున్నాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ముందువరుసలో ఉన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఉగ్రవాద చర్యల వల్ల మేమే బాధితులం. అమాయకులపై జరిపే ఉగ్రదాడులకు ఎలాంటి న్యాయమైన కారణం ఉండదు. ఉగ్రవాదం మంచిదా, చెడ్డదా అనే తేడా లేదు. ఇలాంటి అవాస్తవ ఆరోపణలతో భద్రతా మండలి సమయాన్ని వృథా చేయొద్దు" అని పాక్ మంత్రికి కఠినంగా హెచ్చరించారు.

    వివరాలు 

    జమ్మూ-కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే

    జమ్మూ-కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని స్పష్టంగా పేర్కొన్నారు.

    ఇటీవల జరిగిన కశ్మీర్‌ ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పడటం ప్రజాస్వామ్య బలాన్ని చూపించిందని వివరించారు.

    ''కశ్మీర్ ప్రజల ఎంపిక ఎంతో స్పష్టంగా ఉంది. పాకిస్తాన్‌లోని అనిశ్చిత ప్రజాస్వామ్య పరిస్థితులకు విరుద్ధంగా, కశ్మీర్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది'' అంటూ పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇచ్చారు.

    పాకిస్తాన్‌ ఎప్పటిలాగే కశ్మీర్‌ అంశంపై తన మొండి వాదనను కొనసాగిస్తోంది.

    ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయాలని, కశ్మీర్ ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే అవకాశం కల్పించాలని కోరింది.

    ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌ పార్లమెంటు కశ్మీర్‌కు మద్దతుగా ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, ఇదే మొదటిసారి కాదు, పాకిస్తాన్‌ గతంలోనూ ఇటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టింది.

    వివరాలు 

    మానవ హక్కుల పరిరక్షణ కోసం భారత్‌ చర్యలు

    ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ, పాకిస్తాన్‌ కశ్మీర్ వ్యవహారాల మంత్రి ఇంజనీర్ అమీర్ ముకమ్ మాట్లాడుతూ, ''కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పాకిస్తాన్‌ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతును కొనసాగిస్తుంది. మానవ హక్కుల పరిరక్షణ కోసం భారత్‌ చర్యలు తీసుకోవాలి. నిర్బంధంలో ఉన్న నేతలను విడుదల చేయడంతో పాటు అణచివేత ధోరణిని తక్షణం నిలిపివేయాలని కోరుతున్నాం'' అని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ రాజ్‌నాథ్ సింగ్
    Rents surge: ఢిల్లీతో సహా 7 ప్రధాన భారతీయ నగరాల్లో 70% పెరిగిన అద్దెలు  భారతదేశం
    Cop conference: అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాలి.. భారత్‌ హెచ్చరిక ప్రపంచం
    Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్‌ రైలు.. ట్రయల్‌ రన్‌ ప్రారంభం  రైల్వే బోర్డు

    పాకిస్థాన్

    Coast Guard: పాకిస్తాన్ చెర నుండి ఏడుగురు భారతీయ మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్  భారతదేశం
    Blind T20 World Cup: పాకిస్థాన్‌ వేదికగా అంధుల టీ20 ప్రపంచ కప్‌.. వైదొలిగిన భారత్! టీ20 ప్రపంచకప్‌
    #Newsbytesexplainer: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య నిర్మించిన డైరెక్ట్ సముద్ర మార్గం భారత్‌కు ఆందోళన కలిగిస్తుందా? భారతదేశం
    UAE : యూఏఈ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025