Page Loader
India's deadly stampedes: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు.. 
దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు..

India's deadly stampedes: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన భయానక ఘటనకు దారితీసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా దేశవ్యాప్తంగా చోటుచేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

వివరాలు 

మంధర్‌దేవి ఆలయం 

2005లో మహారాష్ట్రలోని మంధర్‌దేవి ఆలయంలో తొక్కిసలాటలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కుంభమేళా 2003లో నాసిక్‌లో జరిగిన కుంభమేళాలో 39మంది మృతి చెందారు. చాముండా దేవి ఆలయం 2008లో రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో 250 మంది మరణించారు. నైనా దేవి ఆలయం అదే సంవత్సరం హిమాచల్‌ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో 162మంది ప్రాణాలు కోల్పోయారు. రతన్‌గఢ్ ఆలయం 2013లో మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ ఆలయంలో 115 మంది మరణించారు. ఇండోర్‌ 2023లో ఇండోర్‌లో ఆలయ స్లాబ్ కూలడంతో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. శబరిమల 2011లో కేరళలో శబరిమల దగ్గర 104 మంది మరణించారు. గాంధీ మైదానం 2014లో బీహార్‌లోని గాంధీ మైదానంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

పట్నా

2012లో పట్నాలో ఛఠ్ పూజ సందర్భంగా తొక్కిసలాటలో 20 మంది మరణించారు. వైష్ణోదేవి ఆలయం 2022లో జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయంలో 12 మంది మృతి చెందారు. రాజమండ్రి 2015లో రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా 27 మంది మరణించారు. హరిద్వార్‌ 2011లో హరిద్వార్‌లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. రామ్ జానకి ఆలయం 2010లో ప్రతాప్‌గఢ్‌లో రామ్ జానకి ఆలయంలో 63 మంది మరణించారు. హత్రాస్‌ 2024లో హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

గుంపులో చిక్కుకున్నప్పుడు.. సురక్షితంగా బయటపడేందుకు.. ఏమి చేయాలంటే  

రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లి, గుంపులో చిక్కుకుపోతే.. సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించాలి. కింద తెలిపిన ఉపాయాలు అనుసరించి మనం గుంపునుంచి సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నం చేయాలి. ప్రవేశం మరియు నిష్క్రమణ మార్గాలను గుర్తుంచుకోండి: ఎప్పుడైనా రద్దీగా ఉన్న ప్రదేశానికి వెళ్లినప్పుడు, అక్కడి ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ మార్గాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రదేశం గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి: మీరు వెళ్లిన ప్రదేశం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం అవసరం. అప్పుడు, మీరు జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకొని సురక్షితంగా బయటపడటం సులభం.

వివరాలు 

సురక్షితంగా బయటపడేందుకు.. ఏమి చేయాలంటే  

మానసికంగా సిద్ధంగా ఉండండి: రద్దీగా ఉన్న ప్రదేశానికి వెళ్లే ముందు, అశాంతి పరిస్థితులకు తట్టుకోడానికి మానసికంగా సిద్ధంగా ఉండటం మంచిది. నిష్క్రమణ మార్గం సమీపంలో ఉండటం ఉత్తమం. వ్యతిరేక దిశలో పోవద్దు: జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, ప్రతికూల దిశలో ముందుకు వెళ్లడం వలన ఆపద మరింత పెరిగే అవకాశం ఉంటుంది. శాంతంగా ముందుకు కదలండి: గుంపులో చిక్కుకున్నప్పుడు, ఆందోళన చెందకుండా, ప్రశాంతంగా మనస్సును ఉంచుకుని, ముందుకు కదలడం ద్వారా, సురక్షితంగా బయటపడవచ్చు. జనసమూహం దిశలో కదలండి: జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, మీరు అవతలి దిశకు నడవడం కాకుండా, దిశ అనుసరిస్తూ ముందుకు కదలడం ద్వారా ఆపద నుండి తప్పించుకోవచ్చు. కొంత స్థలం కనిపిస్తే, దానిని సద్వినియోగం చేసుకోవాలి.

వివరాలు 

సురక్షితంగా బయటపడేందుకు.. ఏమి చేయాలంటే  

చాతీ కాపాడుకునేందుకు చేతులు ఉంచండి: జనం మధ్య చిక్కుకున్నప్పుడు, మీ చేతులను బాక్సర్ మాదిరిగా మీ ఛాతీ ముందు ఉంచుకోవడం వల్ల, మీ ఛాతీ సురక్షితంగా ఉంటుంది. కిందపడిపోతే లేవడానికి ప్రయత్నించండి: జనసమూహంలో పడిపోయినపుడు, మీరు త్వరగా లేవడానికి ప్రయత్నించండి. పడ్డాక రక్షణ తీసుకోండి: మీరు కింద పడిపోయి లేవలేకపోతే, వెంటనే ఒక వైపు తిరిగి, మీ కాళ్ళను ఛాతీకి సమీపంలో ఉంచుకుని, చేతులను తలపై ఉంచడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. గోడలతో దూరంగా ఉండండి: రద్దీగా ఉన్న ప్రదేశంలో చిక్కుకున్నప్పుడు, గోడలకు, బారికేడింగ్‌కు దూరంగా ఉండటం అవసరం. అలా ఉంటే, త్వరగా బయటకి వెళ్లవచ్చు.