Page Loader
PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక సమావేశం 
ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక సమావేశం

PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక సమావేశం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2025
08:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (J D Vance) భారత పర్యటనలో భాగంగా నేడు దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాణిజ్య సంబంధాలు, సుంక విధానాలు, ప్రాంతీయ భద్రతా అంశాలు సహా పలు ద్వైపాక్షిక విషయాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఉపాధ్యక్ష పదవిని స్వీకరించిన అనంతరం జేడీ వాన్స్‌ భారత్‌కు వచ్చింది మొదటిసారి కావడం గమనార్హం. జేడీ వాన్స్‌కు ఆయన భార్య ఉషా వాన్స్‌, ముగ్గురు పిల్లలు, ఇతర ఉన్నతస్థాయి అధికార ప్రతినిధులు కూడా ఈ పర్యటనలో తోడున్నారు.

Details

స్వాగతం పలికిన అశ్విని వైష్ణవ్

సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్న వాన్స్‌ దంపతులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సహా పలువురు అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంలో వాన్స్‌ పిల్లలు ఇవాన్‌, వివేక్‌, కుమార్తె మీరాబెల్‌ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి మీడియా దృష్టిని ఆకర్షించారు. వారు అక్షర్‌ధామ్‌ ఆలయ సందర్శన చేసిన అనంతరం, ప్రధానమంత్రి మోదీ అమెరికా ప్రతినిధుల బృందానికి ప్రత్యేక విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ట్రంప్‌ టారిఫ్‌ దృక్పథం నేపథ్యంలో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం లభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.