NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: దేవినేని అవినాష్‌,జోగి రమేశ్‌, మరో 20 మందికి ముందస్తు బెయిల్‌ మంజూరు 
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: దేవినేని అవినాష్‌,జోగి రమేశ్‌, మరో 20 మందికి ముందస్తు బెయిల్‌ మంజూరు 
    దేవినేని అవినాష్‌,జోగి రమేశ్‌, మరో 20 మందికి ముందస్తు బెయిల్‌ మంజూరు

    Supreme Court: దేవినేని అవినాష్‌,జోగి రమేశ్‌, మరో 20 మందికి ముందస్తు బెయిల్‌ మంజూరు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రబాబు నాయుడు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో జరిగింది.

    వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాష్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ పూర్తిచేసి, వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

    విచారణ సందర్భంగా,ప్రభుత్వం తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపించారు.

    వివరాలు 

    ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

    "నిందితులు గత మూడేళ్లుగా బెయిల్ లేదా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే వారు కోర్టును ఆశ్రయించారు.నిందితులు తాము చేసిన తప్పును తెలుసుకున్నారు.ప్రభుత్వం మారిన తర్వాత తమ తప్పు బయటపడుతుందనే భయంతో కోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి నివాసంపై, ఆయనకు జడ్ ప్లస్ భద్రత ఉన్నా దాడి చేశారు. అంతేకాకుండా, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. తెదేపా కార్యాలయంపై జరిగిన దాడిలో దేవినేని అవినాష్ ప్రధాన సూత్రధారి. అతడు దర్యాప్తుకు పూర్తిగా సహకరించడం లేదు" అని కోర్టుకు తెలిపారు.

    వివరాలు 

    దర్యాప్తుకు సహకరించాలి

    ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "మూడేళ్లుగా దర్యాప్తు చేపట్టకుండా తాత్సారం చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించారు.హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో జోక్యం చేసుకునేలా ఎలాంటి స్పష్టమైన కారణాలు కనిపించలేదు. జోగి రమేశ్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లకూడదు. వీరు తప్పనిసరిగా దర్యాప్తుకు సహకరించాలి" అని సుప్రీంకోర్టు ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    సుప్రీంకోర్టు

    Supreme Court: సామ్యవాదం, లౌకికతపై వివాదం.. కీలక తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు  ఇండియా
    Ballots in Elections: ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు సహించం.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు కేఏ పాల్
    Supreme Court: రిజర్వేషన్ల కోసం హిందువునంటే.. రాజ్యాంగాన్ని మోసం చేయడమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు  భారతదేశం
    Sambhal Violence: ట్రయల్ కోర్టు అనుమతిపై స్టే.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025