NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka:18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్‌ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Karnataka:18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్‌ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!  
    18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్‌ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!

    Karnataka:18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్‌ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!  

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    08:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రెండు నెలల క్రితం అసెంబ్లీలో జరిగిన అనుచిత ప్రవర్తన నేపథ్యంలో ఆరు నెలల పాటు సస్పెండ్ అయ్యిన 18మంది బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక శాసనసభ స్పీకర్ యూత్ ఖాదర్ తాజాగా ఎత్తివేశారు.

    ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత ఆర్. అశోక, న్యాయ శాఖ మంత్రి హెచ్.కే. పాటిల్‌ హాజరైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

    2024 మార్చి 21న అసెంబ్లీలో స్పీకర్‌కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు ప్రవర్తించినందున,"అనుచిత ప్రవర్తన" ఆరోపణలతో వారిపై సస్పెన్షన్ విధించారు.

    అప్పటి ఘటనలో బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీ చుట్టూ గుమిగూడి నిరసన తెలిపారు.

    వివరాలు 

    ఎమ్మెల్యేలు మా శత్రువులు కాదు, మిత్రులే

    కొందరు సభ్యులు కాగితాలు విసిరి గందరగోళం సృష్టించడంతో,మార్షల్స్ వారిని బలవంతంగా సభ నుంచి బయటకు తరలించాల్సి వచ్చింది.

    తాజాగా జరిగిన చర్చల అనంతరం స్పీకర్ ఖాదర్ మీడియాతో మాట్లాడుతూ,"ఆ సమయంలో పరిస్థితులు నిర్బంధంగా మారాయి.అయితే మంత్రులు, ప్రతిపక్ష నేతలు కలసి శాంతియుతంగా చర్చించి,ఈ రోజు సస్పెన్షన్ ఎత్తివేయాలన్న నిర్ణయానికి వచ్చాం.ఎమ్మెల్యేలు మా శత్రువులు కాదు, మిత్రులే" అని వ్యాఖ్యానించారు.

    ఈ నిర్ణయాన్ని శాసనసభ తదుపరి సమావేశంలో అధికారికంగా ఆమోదించనున్నారు అని కూడా స్పష్టం చేశారు.

    అలాగే, అన్ని రాజకీయ పార్టీల మధ్య చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తూ, "బీజేపీ ఎమ్మెల్యేలు తమ తప్పును గ్రహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలి" అని స్పీకర్ తెలిపారు.

    వివరాలు 

    స్పీకర్‌ను సంప్రదించిన కేంద్ర మంత్రులు

    ఇందుకు సంబంధించి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కూడా ముఖ్యమంత్రి, స్పీకర్‌కు లేఖ రాసినట్లు సమాచారం.

    కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శోభా కరంద్లాజే తదితరులు కూడా స్పీకర్‌ను సంప్రదించారు.

    ప్రతిపక్ష నేత అశోక ఈ అంశంపై అనేకసార్లు స్పీకర్‌ను కలిశారని, ఆయన నుంచి లిఖితపూర్వక క్షమాపణల లేఖ కూడా అందిందని స్పీకర్ ఖాదర్ వెల్లడించారు.

    సస్పెన్షన్ ఎత్తివేసిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో ప్రధానంగా దొడ్డనగౌడ జి. పాటిల్, మాజీ ఉపముఖ్యమంత్రి సి.ఎన్. అశ్వత్ నారాయణ్, ఎస్.ఆర్. విశ్వనాథ్, బి.ఏ. బసవరాజు, బి.పి. హరీష్, చంద్రు లామాణి, మునిరత్న తదితరులు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Karnataka:18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్‌ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!   కర్ణాటక
     Shehbaz Sharif-Erdogan: టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధాని తొలి సమావేశం..  పాకిస్థాన్
    Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం  మధ్యప్రదేశ్
    Taj Mahal: తాజ్ మహల్ వద్ద అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తాజ్ మహల్

    కర్ణాటక

    AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం ఆంధ్రప్రదేశ్
    Karnataka: బెంగళూరులో 8 నెలల బాలికలో HMPV వైరస్ ఇన్ఫెక్షన్.. ఇది దేశంలోనే మొదటి కేసు భారతదేశం
    HMPV: గుజరాత్‌లో రెండు సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ.. ధ్రువీకరించిన డాక్టర్లు గుజరాత్
    HMPV Virus: బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన సిద్ధరామయ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025