NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kolkata rape murder case: కోల్‌కతా డాక్టర్ ఘటన కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Kolkata rape murder case: కోల్‌కతా డాక్టర్ ఘటన కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 
    కోల్‌కతా డాక్టర్ ఘటన కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    Kolkata rape murder case: కోల్‌కతా డాక్టర్ ఘటన కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    12:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసు తదుపరి విచారణ సుప్రీం కోర్టులో జరుగుతోంది.

    ఈ విచారణకు జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అధ్యక్షత వహిస్తోంది.

    పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున కపిల్ సిబల్ సీల్డ్ కవర్ ద్వారా సుప్రీం కోర్టుకు ప్రస్తుత పరిస్థితులపై నివేదిక సమర్పించారు, ఇందులో వైద్యుల సమ్మెల కారణంగా 23 మంది మరణించినట్లు పేర్కొంది.

    వివరాలు 

     సీఐఎస్ఎఫ్ అధికారులకు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదు:  సోలిసిటర్ జనరల్ 

    ఈ హత్యాచార ఘటనపై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసిన సాంపిల్స్‌పై విచారణ చేపట్టగా, సుప్రీం కోర్టు కొత్త స్టేటస్ రిపోర్ట్ సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

    కోర్టు సీబీఐకి మరో వారం రోజులు గడువు ఇచ్చింది. సోలిసిటర్ జనరల్ బెంగాల్ ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ అధికారులకు సహకరించడం లేదని కోర్టులో తెలిపారు.

    కోర్టు సీఐఎస్ఎఫ్ అధికారులను రేసిడెంట్ డాక్టర్ల క్వార్టర్స్, మెడికల్ కాలేజ్,ఇందిరా మైత్రి సదన్ వద్ద వసతి కల్పించాల్సిందిగా ఆదేశించింది.

    వైద్యుల రక్షణకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్‌ను కూడా సమర్పించాలని కోరింది. ఈ కేసు మొదటి విచారణ ఆగస్టు 22న జరిగింది.

    కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి, ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.

    వివరాలు 

     'రీక్లెయిమ్ ది నైట్' మార్చ్ 

    అలాగే, ఆగస్టు 15న ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన నిరసన సందర్భంగా జరిగిన మూక హింసపై సీబీఐతో పాటు బెంగాల్ ప్రభుత్వం నివేదిక సమర్పించాలని కోరింది.

    ఇక భారతీయ ప్రవాసులు 25 దేశాల్లోని 130 నగరాల్లో నిరసనలు నిర్వహించారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన డాక్టర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

    ఈ ఘటన జరిగిన నెలరోజులు పూర్తయిన నేపథ్యంలో వేలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ 'రీక్లెయిమ్ ది నైట్' మార్చ్ నిర్వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    సుప్రీంకోర్టు

    Supreme Court: కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. పిటిషన్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు    భారతదేశం
    Hemanth Soren: హేమంత్‌ సొరేన్‌ మధ్యంతర బెయిల్‌ కు సుప్రీం నిరాకరణ హేమంత్ సోరెన్
    Supreme Court : 8మంది పాపులర్ ఫ్రంట్ ఇండియా సభ్యులకు బెయిల్‌ రద్దు  భారతదేశం
    Form 17C: ఫారం 17C అంటే ఏమిటి? సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏడీఆర్ .. సరికాదన్న ఎన్నికల సంఘం  ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025