NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు 
    తదుపరి వార్తా కథనం
    ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు 
    18 రైళ్ల రద్దు.. పలు రైళ్ల దారి మళ్లింపు

    ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 03, 2023
    09:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే దాదాపు 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

    ఈ మేరకు టాటానగర్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా మరో ఏడు రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించారు.

    హౌరా - పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హౌరా - బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ (12863), హౌరా - చెన్నై మెయిల్‌ (12839), హౌరా -సికింద్రాబాద్‌ (12703), హౌరా - హైదరాబాద్‌ (18045), హౌరా - తిరుపతి (20889), హౌరా - పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12895), హౌరా - సంబల్‌ పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831), సంత్రగాచి - పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02837) రైళ్లు రద్దైన జాబితాలో ఉన్నాయని రైల్వే ఆఫీసర్లు స్పష్టం చేశారు.

    Odisha Railway Accident

    గోవా - ముంబయి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం వాయిదా

    బెంగళూరు - గువాహటి (12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్‌, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ పరిధిలోని చెన్నై సెంట్రల్‌ - హౌరా (12840) రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా - షాలిమార్‌ (18048), సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (22850) వారాంతపు రైళ్లను కటక్‌ మీదుగా దారి మళ్లించామన్నారు.

    ఘటనతో గోవా - ముంబయి వందేభారత్‌ నూతన ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు కొంకణ్‌ రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు.

    ముందుస్తు షెడ్యూల్ మేరకు శనివారం ఉదయం వీడియో అనుసంధానం ద్వారా ప్రధాని ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది.

    మరోవైపు దుర్ఘటనపై ఏఐసీసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కష్టకాలంలో ఒడిషా ప్రజలకు తోడుగా నిలవాలని కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే శాఖ మంత్రి
    రైలు ప్రమాదం
    ఒడిశా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025