NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే
    తదుపరి వార్తా కథనం
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే

    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే

    వ్రాసిన వారు Stalin
    May 28, 2023
    09:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త పార్లమెంట్ భవనాన్ని అధునాతన హంగులతో, భారతీయత ఉట్టిపేడలా నిర్మించారు.

    75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త పార్లమెంట్‌ను నిర్మాణాన్ని చేపట్టింది.

    టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి.

    దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతం నుంచి ఏదో ఒక వస్తువును పార్లమెంట్ నిర్మాణంలో భాగం చేశారు. తద్వారా తద్వారా 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని నింపారు.

    దిల్లీ

    రాజస్థాన్ నుంచి ఎరుపు, తెలుపు ఇసుక

    కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో ఉపయోగించిన ఎరుపు, తెలుపు ఇసుకరాయిని రాజస్థాన్‌లోని సర్మతుర నుంచి తెప్పించారు.

    ఈ భవనంలో ఉపయోగించిన టేకు చెక్కను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి తీసుకొచ్చారు.

    కేశారియా గ్రీన్ స్టోన్ ఉదయపూర్ నుంచి, రెడ్ గ్రానైట్ అజ్మీర్ సమీపంలోని లఖా నుంచి, వైట్ మార్బుల్ రాజస్థాన్‌లోని అంబాజీ నుంచి సేకరించారు.

    కొత్త భవనంలోని ఫర్నిచర్ ముంబైలో చేయించారు.

    లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్‌లలో ఫాల్స్ సీలింగ్‌లను కేంద్రపాలిత ప్రాంతం డామన్, డయ్యూ నుంచి తీసుకొచ్చారు.

    ఈ భవనానికి చూట్టూ అవసరమయ్యే రాతి జాలీ నిర్మాణం కోసం రాజస్థాన్‌లోని రాజ్‌నగర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా నుంచి కూలీలను తీసుకొచ్చారు.

    దిల్లీ

    యూపీ, హర్యానా నుంచి ఫ్లై యాష్ ఇటుకలు 

    మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్థాన్‌లోని జైపూర్‌ల నుంచి అశోక చిహ్నానికి సంబంధించిన సామగ్రిని సేకరించారు.

    లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్‌లు, పార్లమెంటు భవనం వెలుపలి భాగాలను ధరించే అశోక్ చక్రను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి సేకరించారు.

    రాతి చెక్కడం పనిని అబు రోడ్, ఉదయపూర్ నుంచి శిల్పులును రప్పించారు.

    రాజస్థాన్‌లోని కొట్‌పుటాలి నుంచి రాతి కంకరలను సేకరించారు.

    కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ కార్యకలాపాల కోసం కాంక్రీట్ మిశ్రమాన్ని కలిపేందుకు దాద్రీ నుంచి ప్రత్యేక ఇసుకను తెప్పించారు.

    నిర్మాణంలో ఉపయోగించిన ఫ్లై యాష్ ఇటుకలను హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు.

    నిర్మాణంలో అవసమైన ఇత్తడి పనులు, ప్రీ-కాస్ట్ ట్రెంచ్‌లు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగాయి.

    దిల్లీ

    64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో పార్లమెంట్‌ నిర్మాణం

    కొత్త పార్లమెంట్ భవనం లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలైన కమలం, నెమలి, రావి చెట్టు ఉంటాయి.

    కొత్త పార్లమెంట్ భవనంలో భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించడానికి గొప్ప రాజ్యాంగ మందిరం, ఎంపీల కోసం లాంజ్, లైబ్రరీ, బహుళ కమిటీ గదులు, భోజన ప్రాంతాలు, విశాలమైన పార్కింగ్ స్థలం ఉన్నాయి.

    త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల్లో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో పార్లమెంట్‌ను నిర్మించారు.

    భవనానికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిని జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పిలుస్తారు. వీఐపీలు, ఎంపీ, సందర్శకుల కోస ఈ ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేశారు.

    ఈ భవనంలో లోక్‌సభ ఛాంబర్‌లో 888మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్‌లో 300మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    లోక్‌సభ
    రాజ్యసభ
    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    తాజా

    Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో  ఇండిగో
    MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు ముంబయి ఇండియన్స్
    Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Trump: $175 బిలియన్ల 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థ: ట్రంప్ అమెరికా

    దిల్లీ

    'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ మనీష్ సిసోడియా
    ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ
    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత వాతావరణ మార్పులు
    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు

    లోక్‌సభ

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా రాజ్యసభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    రాజ్యసభ

    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు లోక్‌సభ

    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు ప్రహ్లాద్ జోషి
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025