NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు 
    ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

    AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2025
    08:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ నెల 23 లేదా 24 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)మంగళవారం ప్రకటించింది.

    అలాగే, ఈ రుతుపవనాలు ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కూడా ప్రవేశించనున్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    2009 తర్వాత ఇలా రావడం ఇదే మొదటిసారి!

    గత ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే రెండు రోజుల ముందుగా మే 30న కేరళను తాకాయి.

    ఇదేరోజున తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించాయి.

    ఒకేసారి కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకడం చాలా అరుదైన విషయం.

    వివరాలు 

    ఆంధ్రప్రదేశ్‌కి అతి భారీ వర్షాల హెచ్చరిక 

    ఇదివరకు 2017లో మాత్రమే ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది. ఈ సంవత్సరం కూడా ఇదే తరహాలో పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణుల అంచనా.

    ఐఎండీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2009లో మే 23న కేరళలోకి నైరుతి ప్రవేశించాయి.

    ఈ ఏడాది అంచనాల ప్రకారం మే 24న నైరుతి ప్రవేశిస్తే, 2009 తర్వాత అత్యంత త్వరగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన సందర్భంగా ఇది నమోదవుతుంది.

    అరేబియా సముద్రంలో మే 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

    మరోవైపు, బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర,ఉత్తర తమిళనాడు ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

    వివరాలు 

    ఆంధ్రప్రదేశ్‌కి అతి భారీ వర్షాల హెచ్చరిక 

    వీటి ప్రభావంతో బుధవారం,గురువారం రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

    ముఖ్యంగా బుధవారం రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వాతావరణ శాఖ

    తాజా

    AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు  ఆంధ్రప్రదేశ్
    Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు   ఇరాన్
    Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు ముంబై
    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్

    ఆంధ్రప్రదేశ్

     Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు! అమరావతి
    #NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ రాజధాని పై కొనసాగుతున్న వివాదం: మారుతున్న రాజకీయ నిర్ణయాలు భారతదేశం
    AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర!  వైసీపీ
    ICSE Results : 2025 ICSE, ISC ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే! భారతదేశం

    వాతావరణ శాఖ

    AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు 'రెడ్‌ అలర్ట్‌' పశ్చిమ బెంగాల్
    IMD: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ హైదరాబాద్
    Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక భారతదేశం
    IMD : నవంబర్‌లో చలి తక్కువే.. వాతావరణ శాఖ నివేదిక ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025