NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం 
    తదుపరి వార్తా కథనం
    North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం 
    ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం

    North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2025
    11:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈశాన్య భారతదేశంలో ఎప్పటికప్పుడు కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది.

    వరదలు ముంచెత్తడంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్కర సంఘటనలతో కలిపి, ఇప్పటివరకు మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

    సోమవారం నాటికి సుమారు 5.5 లక్షల మందికి పైగా ఈ ప్రకృతి విపత్తు బారిన పడ్డారు.

    అసోం రాష్ట్రంలో అత్యధికంగా 11 మంది మరణించగా, అరుణాచల్ ప్రదేశ్‌లో 10 మంది, మేఘాలయలో 6 మంది, మిజోరంలో 5 మంది, సిక్కింలో 3 మంది, త్రిపురలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

    వివరాలు 

    అసోం - నీటి ముంపుతో నలిగిపోతున్న జిల్లాలు 

    అసోం రాష్ట్రంలో 22 జిల్లాల్లో వరదలు తీవ్రంగా విస్తరించాయి. అధికారిక సమాచారం ప్రకారం, 5.35 లక్షల మందికి పైగా ఈ బీభత్సం బారిన పడ్డారు.

    వరదల కారణంగా ఇప్పటివరకు 11 మంది మరణించారు. 15 నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

    లఖింపూర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ప్రజలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

    భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ తీవ్రంగా అస్తవ్యస్తమైంది. రోడ్లు, రైలు మార్గాలు, ఫెర్రీ సేవలు నిలిచిపోయాయి.

    గువాహటిలో మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాతో సమావేశమైన శర్మ, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించారు.

    వివరాలు 

    అసోం  

    వీరిద్దరూ అసోం-మేఘాలయ సరిహద్దు వివాదం,ఉమ్మడి విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులు, గౌహటిలో వరదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.

    గత కొంతకాలంగా మేఘాలయలో రి-భోయి జిల్లాలో జరుగుతున్న కొండ కోతల కారణంగా గౌహటిలో నీటి నిల్వ, వరదలు పెరుగుతున్నాయని శర్మ వివరించారు.

    ఈ నేపథ్యంలో గౌహటిలో వరదలకు కారణమైన పర్యావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి ఉపగ్రహాల ఆధారంగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించడంతో, ఈ బాధ్యతను నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (NE-SAC) కు అప్పగించారు.

    గౌహటిలో నీటి నిల్వలను తగ్గిస్తూ, మేఘాలయ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా సంయుక్త ప్రణాళికతో పనిచేయాలని ఇరువురు ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు.

    వివరాలు 

    సిక్కిం 

    శాటిలైట్ మ్యాపింగ్, అటవీ పరిధి, నీటి ప్రవాహ మార్గాలు, జలదిగ్బంధ ప్యాటర్న్‌లు మొదలైన అంశాలపై NE-SAC మూడు నెలల్లో పూర్తి నివేదిక సమర్పించనుంది.

    సిక్కింలో మాంగన్ జిల్లాలోని లాచెన్ సమీపంలోని చాటెన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.

    ఈ ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరొక తొమ్మిది మంది గల్లంతయ్యారు.

    అధికారులు తెలిపిన ప్రకారం,విస్తారంగా కురుస్తున్న వర్షాలే కొండచరియల కారణమని భావిస్తున్నారు.

    మృతులుగా గుర్తించబడినవారు హవల్దార్ లఖ్వీందర్ సింగ్,లాన్స్ నాయక్ మునీష్ ఠాకూర్,పోర్టర్ అభిషేక్ లఖాడా.

    గల్లంతైన సైనికుల కోసం భద్రతా బృందాలు క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

    వివరాలు 

    సిక్కిం 

    లాచుంగ్, చుంగ్తాంగ్ పట్టణాల్లో చిక్కుకున్న 1,678 మంది పర్యాటకులను అధికారులు సురక్షితంగా తరలించగా, మరో 100 మందికి పైగా లాచెన్‌లో చిక్కుకుపోయారని సిక్కింలో డీజీపీ అక్షయ్ సచ్దేవ్ తెలిపారు.

    మే 29 నుంచి మాంగన్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపోయాయి.

    ఫిడాంగ్ సంగ్కలాంగ్ ప్రాంతంలోని వంతెనలు భాగికంగా దెబ్బతిన్నాయి. రహదారి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

    లాచెన్,లాచుంగ్,గురుడోంగ్మార్,వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్,జీరో పాయింట్ వంటి పర్యాటక కేంద్రాలకు దారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.

    తీస్తా నది 35-40 అడుగుల మేర ఉప్పొంగి ప్రవహించడంతో ప్రాంతీయ కనెక్టివిటీ, రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

    సిక్కింకు రానున్న పర్యాటకులు ప్రస్తుత పరిస్థితులు పరిశీలించిన తరువాత మాత్రమే ప్రయాణించాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

    వివరాలు 

    మణిపూర్ 

    గత నాలుగు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్ రాష్ట్రంలో అనేక నదులు ఉప్పొంగాయి.

    దీంతో కొన్ని ప్రాంతాల్లో కరకట్టలు తెగిపోవడం జరిగింది. ఈ వరదల ప్రభావంతో 19,000మందికి పైగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.

    అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 3,365ఇళ్లు దెబ్బతిన్నాయి,103ప్రాంతాలు నీటమునిగాయి.

    19,811మంది ప్రజలు తాత్కాలికంగా నిరాశ్రయులయ్యారు. వారి కోసం ప్రభుత్వం మొత్తం 31 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది.

    వీటిలో ఎక్కువ శిబిరాలు ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఉన్నాయి.

    భారీగా నీరు వచ్చి ముంచెత్తిన నేపథ్యంలో, జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (JNIMS) లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థులు,సిబ్బందిని రక్షించేందుకు మణిపూర్ ఫైర్ సర్వీస్,అసోం రైఫిల్స్,ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌,ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి.

    వివరాలు 

    అరుణాచల్ ప్రదేశ్

    ఇంఫాల్ నదిలో నీటి మట్టం పెరిగి కరకట్టలు నాలుగు చోట్ల తెగిపోవడంతో భారీగా వరదలు వచ్చాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

    అరుణాచల్ ప్రదేశ్‌లో వరదలతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

    తాజాగా లోహిత్ జిల్లాలో మరో మరణం నమోదైందని అధికారులు తెలిపారు.

    రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 156 గ్రామాల ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. మొత్తం 938 మంది బాధితులుగా గుర్తించబడ్డారు.

    రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కేటీ పర్నాయక్ (రిటైర్డ్) మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

    ప్రజలు, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

    వివరాలు 

    మణిపూర్ 

    పశ్చిమ కమెంగ్, కమ్లే, ఎగువ - దిగువ సుబన్సిరి, పాపుమ్ పరే, దిబాంగ్ లోయ, లోయర్ దిబాంగ్ లోయ, లోహిత్, చాంగ్లాంగ్, క్రా దాదీ, కురుంగ్ కుమే, లాంగ్డింగ్ వంటి జిల్లాల్లో నదులు, ఉపనదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.

    అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి.

    వివరాలు 

    త్రిపుర 

    త్రిపురలో వర్షపాతం సోమవారం నుండి కొంత తగ్గుముఖం పట్టింది. అధికారుల ప్రకారం, నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి మించకుండా పడిపోయాయి.

    అయితే, పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, సుమారు 10,813 మంది ప్రజలు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు.

    ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 66 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.

    వీటిలో ఎక్కువగా పశ్చిమ త్రిపుర జిల్లాలో ఉన్న 50 శిబిరాల్లో 2,352 కుటుంబాలు ఉన్నారు.

    ప్రభుత్వం తిరిగి ప్రజలను తమ ఇంటికి పంపే ప్రయత్నాల్లో ఉంది, అయితే ఇంకా పరిస్థితి పూర్తిగా సరిదిద్దబడలేదు.

    వివరాలు 

    మిజోరం

    మిజోరంలో మే 24 నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టాలు నమోదయ్యాయి.

    ఇప్పటివరకు 212 రహదారులు కొండచరియల కారణంగా మూసుకుపోయాయి.

    మే 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు పాఠశాలలు మూసివేయగా, సోమవారం అన్ని పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.

    ఇతర రాష్ట్రాల మాదిరిగానే, ఇక్కడ కూడా కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి.

    ఇప్పటివరకు మూడు మయన్మార్ శరణార్థులతో పాటు మొత్తం ఐదుగురు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి తీవ్రంగా ఉంది.

    కొంతమంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి తాత్కాలిక ఆశ్రయాల వద్ద ఉంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారీ వర్షాలు

    తాజా

    North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం  భారీ వర్షాలు
    Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఒమిక్రాన్‌ బీఏ.2 నిర్ధారణ విశాఖపట్టణం
    Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ పంజాబ్
    Telangana: పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు  తెలంగాణ

    భారీ వర్షాలు

    IMD: అల్పపీడన ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు వాతావరణ శాఖ
    Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు.. మత్స్యకారులకు హెచ్చరికలు తమిళనాడు
    Andhra Pradesh: ఏపీకి భారీ వర్షం.. పోర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ ఆంధ్రప్రదేశ్
    Heavy Rains: నేడు,రేపు భారీ వర్షాలు.. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఐఎండీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025