NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Odisha: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. పూరీ ఆలయంలో నెయ్యి నాణ్యత పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు
    తదుపరి వార్తా కథనం
    Odisha: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. పూరీ ఆలయంలో నెయ్యి నాణ్యత పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు
    పూరీ ఆలయంలో నెయ్యి నాణ్యత పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు

    Odisha: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. పూరీ ఆలయంలో నెయ్యి నాణ్యత పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2024
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో ప్రసాదం వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

    లడ్డూ ప్రసాదంలో కొవ్వు పదార్థం ఉపయోగించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశం రాజకీయాల్లో కూడా వేగంగా చర్చకు దారి తీసింది.

    అదే సమయంలో,ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

    దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయగా,పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ మాట్లాడుతూ, తిరుపతి దేవస్థానంలో జరిగిన ఆరోపణలు తమ వద్ద లేవని స్పష్టం చేశారు.అయినప్పటికీ,12వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతను అధికారులు పరీక్షిస్తారని తెలిపారు.

    ఇక్కడి నెయ్యి సరఫరాదారు ఒడిశా మిల్క్ ఫెడరేషన్ (OMFED)అని వివరించారు.

    వివరాలు 

    సేవకులతో చర్చలు 

    సిద్ధార్థ్ శంకర్ స్వైన్ మాట్లాడుతూ, OMFED ద్వారా సరఫరా అయ్యే నెయ్యి నాణ్యతను సక్రమంగా పరీక్షించి, కల్తీకి అవకాశం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

    ఈ ప్రక్రియలో, ప్రసాదం తయారీకి సహకరిస్తున్న ఆలయ సేవకులతో కూడా చర్చలు జరగనున్నాయని చెప్పారు.

    మరోవైపు, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదం విషయంలో కొవ్వు పదార్థం కూరుకుపోయిందనే ఆరోపణలపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

    వివరాలు 

    పిటిషన్ వివరాలు 

    సూర్జిత్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేసి, దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నియమించాలని సుప్రీం కోర్టును కోరారు.

    ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

    ఈ అంశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాకా కూడా చేరింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక పిటిషన్ దాఖలు చేయగా, తప్పుడు ఆరోపణలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆ ఆరోపణలో పేర్కొన్నారు.

    వివరాలు 

    ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు

    తాజాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, వారి హయాంలో తిరుపతి దేవస్థానం ప్రసాదాల్లో జంతువుల కొవ్వు వాడేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    అయితే, ఇప్పుడేమో స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే వాడుతున్నారని తెలిపారు.ఆయన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి.

    వైఎస్‌ఆర్‌సీపీ నేత వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ, చంద్రబాబు ఆరోపణలను పూర్తిగా ఖండించారు.

    టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, దైవాలయ పవిత్రతను, హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    పూరీ జగన్నాథ దేవాలయం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఒడిశా

    ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి  భువనేశ్వర్
    నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ నవీన్ పట్నాయక్
     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ  పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం

    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం ఇండియా లేటెస్ట్ న్యూస్
    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్
    Puri: 53 ఏళ్ల తర్వాత జగన్నాథ రథయాత్రలో అరుదైన శుభ సందర్భం.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఒడిశా
    Puri: పూరి రథయాత్రకు చెక్కలు ఎక్కడి నుండి వస్తాయి,, తయారీదారులు ఎవరు... రథ నిర్మాణానికి సంబంధించిన ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025