NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rail Coach Factory: కాజీపేటలో రైల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌.. వచ్చే ఆగస్టుకు సిద్ధం.. 3 వేల మందికి ఉపాధి.. 
    తదుపరి వార్తా కథనం
    Rail Coach Factory: కాజీపేటలో రైల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌.. వచ్చే ఆగస్టుకు సిద్ధం.. 3 వేల మందికి ఉపాధి.. 
    కాజీపేటలో రైల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌

    Rail Coach Factory: కాజీపేటలో రైల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌.. వచ్చే ఆగస్టుకు సిద్ధం.. 3 వేల మందికి ఉపాధి.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాజీపేటలో ఏర్పాటవుతున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.

    ఈ యూనిట్‌లో గూడ్స్ వ్యాగన్లు, ఇంజిన్లతో పాటు రైల్వే కోచ్‌ల తయారీ కూడా జరుగుతుందని చెప్పారు.

    జర్మనీలో అభివృద్ధి చెందిన ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు, సబర్బన్ రైళ్లకు ఉపయోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (ఈఎంయూలు) కూడా ఇందులో భాగమవుతాయని పేర్కొన్నారు.

    ప్రణాళిక ప్రకారం, ఈ యూనిట్ ఏడాదికి 600 కోచ్‌లను ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నదని చెప్పారు.

    ఈ ప్రాజెక్ట్ తో 3,000 మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందన్నారు.

    గురువారం రైల్వే స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి ఈ సమాచారాన్ని అందించారు.

    వివరాలు 

    ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.680కోట్లు 

    ప్రధానంగా, కాజీపేటకు పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) ప్రాజెక్టు మంజూరు చేయబడిందని, ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఈ ప్రాజెక్టును విస్తరించారని చెప్పారు.

    ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.680 కోట్లకు చేరుకుందని వెల్లడించారు.

    చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నవంబరులో ప్రారంభించే ఉద్దేశ్యాన్ని కూడా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి స్లీపర్ వందేభారత్ రైళ్లను కూడా తీసుకువస్తామన్నారు.

    వివరాలు 

    కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల పునరభివృద్ధి 

    "రూ.720 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులను 2025 డిసెంబరులో పూర్తి చేస్తాం. నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల పునరాభివృద్ధి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో 40 స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. ఘట్‌కేసర్-రాయగిరి వరకు యాదాద్రి ఎంఎంటీఎస్‌ను కూడా చేపడతాం.తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఫైనల్ లోకేషన్ సర్వేలో ఉన్నాయి, వాటి విలువ రూ.64,780 కోట్లు.ఫైనల్ లోకేషన్ సర్వేలో ఉన్న రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు కొంత సమయం పట్టవచ్చు. ముందు రీజనల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు భూసేకరణ అంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఎంఎంటీఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన సహకారం లభించలేదు. రాష్ట్ర వాటా రూ.700-800 కోట్ల మేర ఇవ్వబడలేదు" అని కిషన్ రెడ్డి వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిషన్ రెడ్డి

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ బీజేపీ
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి వరంగల్ తూర్పు
    KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025