NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shashi Tharoor:'పాక్ తమకు ప్రయోజనం ఉందని భావించింది కానీ..': ఐరాస భద్రతా మండలి సమావేశం నేపథ్యంలో శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Shashi Tharoor:'పాక్ తమకు ప్రయోజనం ఉందని భావించింది కానీ..': ఐరాస భద్రతా మండలి సమావేశం నేపథ్యంలో శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు
    ఐరాస భద్రతా మండలి సమావేశం నేపథ్యంలో శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

    Shashi Tharoor:'పాక్ తమకు ప్రయోజనం ఉందని భావించింది కానీ..': ఐరాస భద్రతా మండలి సమావేశం నేపథ్యంలో శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    03:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో క్లోజ్డ్‌డోర్ మీటింగ్ జరిగింది.

    ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    భద్రతామండలిలో సభ్యదేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం ఏ విధమైన తీర్మానం ఆమోదించబడే అవకాశమే లేదని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.

    ''పాకిస్థాన్‌ను తప్పుబడుతూ ఏదైనా తీర్మానం తీసుకురాగలిగితే,దాన్ని చైనా తప్పకుండా వీటో అధికారంతో అడ్డుకుంటుంది.అదే విధంగా,భారత్‌పై విమర్శలతో కూడిన తీర్మానం వస్తే, చాలా దేశాలు దాన్ని అడ్డుకుంటాయి. చివరికి శాంతికి పిలుపునివ్వడం, ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేయడం వంటి సాధారణ పదజాలంతోనే పరిమితమవుతుంది'' అని ఆయన తెలిపారు.

    దీన్ని మించి మరేదీ అనుకోలేమని, ఇది చాలా విచారకరమైన వాస్తవం అని ఆయన వ్యాఖ్యానించారు.

    వివరాలు 

     పాక్ అణు బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న చాలా దేశాలు

    ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్థాన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

    ఈ చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేయడం కూడా ఉంది.

    ఈ పరిస్థితుల్లోనే ఐరాస భద్రతామండలిలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌ మొదట భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని యోచించినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

    ఇస్లామాబాద్‌ తరచుగా చేస్తున్న అణు బెదిరింపులపై చాలా దేశాలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాయి.

    అంతేకాక, ఇటీవల పాకిస్థాన్ నిర్వహించిన క్షిపణి పరీక్షలను కూడా కొన్ని దేశాలు ప్రశ్నించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శశిథరూర్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    శశిథరూర్

    Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?: కళ్లు చెదిరే సమాధానం చెప్పిన శశిథరూర్ భారతదేశం
    Shashi Tharoor vs Rajeev Chandrasekhar : "అభివృద్ధిపై చర్చిద్దాం".. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సవాల్‌ను స్వీకరించిన శశిథరూర్ రాజీవ్ చంద్రశేఖర్
    Delhi:ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్.. శశి థరూర్ పీఏ అరెస్ట్  దిల్లీ
    Shashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్‌ పోస్ట్‌ వైరల్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025