
Modi in J&K: 'కశ్మీర్లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్ కుట్రలు' : నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
"ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత దేశ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించామని" ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో పాకిస్థాన్ కుట్రలు కొనసాగడానికి ఇక అనుమతి ఇవ్వబోమని ఆయన హెచ్చరించారు.
శుక్రవారం పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆయన తొలిసారిగా జమ్మూ కశ్మీర్ పర్యటనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచంలో అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు.
అలాగే, పలు అభివృద్ధి పథకాలను కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్ ప్రజల కలలు నిజం కావడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మెరుగైన కనెక్టివిటీ కల్పించామని తెలిపారు.
వివరాలు
చీనాబ్ ప్రాజెక్టు కశ్మీర్లో లక్షల మంది ప్రజల కలలకి రూపం
ఈ చీనాబ్ ప్రాజెక్టు కశ్మీర్లో లక్షల మంది ప్రజల కలలకి రూపం దిద్దిందని పేర్కొన్నారు.
తమ పాలనలో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయగలిగామని చెప్పారు.కోవిడ్ సమయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా,వాటిని అధిగమించి పనులను సమర్థవంతంగా పూర్తి చేసినందుకు గర్విస్తున్నట్టు తెలిపారు.
ఈ వంతెన వల్ల కశ్మీర్లో పర్యాటక రంగానికి పెద్దపెద్ద అవకాశాలు ఏర్పడతాయని, దేశ ఇంజినీర్ల ప్రతిభ చాటి చెప్పిన ఘనతగా దీన్ని పేర్కొన్నారు.
అలాగే,రాష్ట్రంలో మరిన్ని మెడికల్ కాలేజీలు నెలకొననున్నాయని మోదీ తెలిపారు.
పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరగనున్నాయని చెప్పారు.
అయితే, పాకిస్థాన్ మాత్రం మానవత్వాన్ని పక్కన పెట్టి పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు చేపట్టిందని ఆరోపించారు.
వివరాలు
22నిమిషాల్లో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాల ధ్వంసం
కశ్మీర్ పర్యాటకరంగం అంతగా అభివృద్ధి చెందుతున్నదాన్నిచూసి పాకిస్థాన్ కుట్రలు పన్నిందని ప్రధాని విమర్శించారు.
అయితే ఇప్పుడు ఎవరూ కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
మోదీ మరింతగా మాట్లాడుతూ,భారత దళాల చర్యలతో పాకిస్థాన్ భయభ్రాంతులకు లోనైందని అన్నారు.
ఉగ్రవాద శిబిరాలపై అచ్చొచ్చే స్థాయిలో స్ట్రైక్స్ నిర్వహించామని,ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదన్న సంకేతాన్ని పంపామని తెలిపారు.
కేవలం 22నిమిషాల్లో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఘనతను గుర్తు చేశారు.
భారత దళాలు ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు,పాకిస్థాన్ మాత్రం భారత్ ప్రజలు, దేవాలయాలపై దాడులకు పాల్పడిందని ప్రధాని విమర్శించారు.
కానీ ఇప్పుడు జమ్ముకశ్మీర్ ప్రజలు పాక్ కుట్రలకు గట్టి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.