NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్
    తదుపరి వార్తా కథనం
    AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్
    ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్

    AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 29, 2024
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త అందించింది.

    ఈసారి పెన్షన్‌ను సడలింపు చేస్తూ, సెప్టెంబర్ నెలకు గానూ ఆగస్టు 31వ తేదీనే ముందుగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

    సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ నెలలో ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ క్రమంలో ఆగస్టు 31న పెన్షన్ పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

    ఒకటో తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారులకు పెన్షన్ వాయిదా కాకుండా ముందే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

    ఇంకా ఏదైనా కారణంతో ఆగస్టు 31న పెన్షన్ తీసుకోని వారు సెప్టెంబర్ 2న పొందవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు.

    వివరాలు 

    2027 నాటికి పోలవరం పూర్తి అవుతుందన్న చంద్రబాబు 

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేస్తామని తెలిపారు.

    మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రయోజనకరమని అన్నారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

    కేంద్రం ఆమోదించిన పారిశ్రామిక హబ్‌లు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెంచుతాయని అన్నారు.

    పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసిందని, ఈ ప్రాజెక్టును 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ రూపొందించామన్నారు.

    ఇంకా రూ.15,146 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    పెన్షన్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్
    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: ఏపీలో రూ.5,367 కోట్ల పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం తుది మెరుగులు  భారతదేశం
    Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు  చంద్రబాబు నాయుడు
    Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు చంద్రబాబు నాయుడు
    Andhra Pradesh: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు  భారతదేశం

    పెన్షన్

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO భారతదేశం
    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జితేంద్ర సింగ్
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు ఉద్యోగులు
    ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు  ఇండియా లేటెస్ట్ న్యూస్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu: మళ్లీ జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా చంద్రబాబు నాయుడు భారతదేశం
    Kingmakers : చంద్రబాబు,నితీష్ కుమార్ లతో మంతనాలు నితీష్ కుమార్
    Chandrababu Naidu : జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం  ఆంధ్రప్రదేశ్
    NDA Alliance: నేడు ఎన్డీయే సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025