NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ 
    ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

    PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చురుకైన మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే.

    ఈ దాడుల అనంతరం దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

    ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు విదేశీ పర్యటనలను రద్దు చేసిన ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఈ నెల మధ్యలో ప్రధాని మోదీ యూరప్‌లోని కొన్ని దేశాలకు వెళ్లాల్సి ఉంది. ఆయన క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్‌ సహా యూరప్‌ పర్యటనలో భాగంగా పలు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది.

    కానీ, ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ఈ పరిస్థితుల మధ్య మోదీ తన పర్యటనలను రద్దు చేసినట్లు సమాచారం.

    వివరాలు 

    9 ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతం 

    అంతేకాదు,రష్యాలో జరిగే విక్టరీ డే ఉత్సవాల్లో మోదీ పాల్గొనడం లేదని ఇటీవలే క్రెమ్లిన్‌ అధికారికంగా ప్రకటించింది.

    ఇది కూడా ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా చెప్పవచ్చు.

    ఇక గత నెలలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు ఘోరంగా దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ దాడికి ప్రతిగా భారత్‌ పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేలా తీవ్ర చర్యలు ప్రారంభించింది.

    ఈ క్రమంలోనే భారత సైన్యం పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులకు పాల్పడింది.

    మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్

    నరేంద్ర మోదీ

    Pamban Bridge: పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ భారతదేశం
    PM Modi: 'సంతకమైనా తమిళంలో చేయండి'.. నేతల తీరుపై మోదీ అసహనం తమిళనాడు
    #NewsBytesExplainer:'విక్టరీ డే' పేరుతో రష్యా వేడుకలు..మోదీకి ఆహ్వానం.. భారత్-చైనా సంబంధాలపై ప్రభావం ఎంత? భారతదేశం
    PM Modi: నేడు కాశీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 44 ప్రాజెక్టులను ప్రారంభించి కాశీ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధాని.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025