NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vizhinjam Seaport: అదానీ గ్రూప్ అభివృద్ధి చేసిన విజిన్‌జ‌మ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Vizhinjam Seaport: అదానీ గ్రూప్ అభివృద్ధి చేసిన విజిన్‌జ‌మ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని మోదీ
    విజిన్‌జ‌మ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని మోదీ

    Vizhinjam Seaport: అదానీ గ్రూప్ అభివృద్ధి చేసిన విజిన్‌జ‌మ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    12:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలో నిర్మించిన కొత్త విజిన్‌జం బహుళ ప్రయోజనాల పోర్టును (Vizhinjam Seaport) ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితమిచ్చారు.

    సుమారు రూ. 8,900 కోట్ల వ్యయంతో ఈ ఇంటర్నేషనల్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్టు నిర్మితమైంది.

    ఈ ప్రాజెక్టును కేరళ ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టింది. ప్రజా-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పోర్టును నిర్మించగా, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి.

    పోర్టు ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా గౌతమ్ అదానీ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ఆయన సన్మానం చేశారు.

    వివరాలు 

    విజిన్‌జం పోర్టు ప్రారంభంతో ఆ సమస్యకు పరిష్కారం

    ఈ పోర్టు రూపకర్త ముఖ్యమంత్రి పినరయి విజయన్ అని మంత్రి వి.ఎన్. వాసన్ వెల్లడించారు.

    ప్రతి సంవత్సరం దేశానికి జరుగుతున్న సుమారు 22 కోట్ల డాలర్ల నష్టాన్ని ఈ పోర్టు తగ్గించగలదని సీఎం విజయన్ తెలిపారు.

    గతంలో అవసరమైన సదుపాయాలు లేనందున దాదాపు 75 శాతం కంటైనర్ కార్గోలను విదేశాల్లోని పోర్టుల ద్వారా మళ్లించాల్సి వచ్చేది.

    అయితే ఇప్పుడు విజిన్‌జం పోర్టు ప్రారంభంతో ఆ సమస్యకు పరిష్కారం లభించనుందని, ఇది దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

    ప్రకారం ప్రకారం ఈ ప్రాజెక్టు 2045 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా, దశాబ్దం ముందే పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.

    ఇప్పటికే ఈ పోర్టుకు 250 నౌకలు వచ్చాయని కూడా ఆయన తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఓడరేవును జాతికి అంకితం చేస్తున్న ప్ర‌ధాని మోదీ

    #WATCH | Thiruvananthapuram, Kerala: Prime Minister Narendra Modi dedicates to the nation 'Vizhinjam International Deepwater Multipurpose Seaport' worth Rs 8,900 crore

    CM Pinarayi Vijayan is also present at the event. This ambitious project of the Kerala government has been… pic.twitter.com/t5bbfMuIUq

    — ANI (@ANI) May 2, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    కేరళ

    Kerala: బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్‌ఫెక్షన్‌తో కేరళ వ్యక్తి మృతి  భారతదేశం
    Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదు మంకీపాక్స్‌
    Murine Typhus: కేరళలో మరో అరుదైన వ్యాధి.. మురిన్ టైఫస్‌ లక్షణాలు,చికిత్స, నివారణ   మురిన్ టైఫస్
    Online Trading: ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. రూ.87 లక్షలు దోచేసిన సైబర్ మోసగాళ్లు ఇండియా లేటెస్ట్ న్యూస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025