NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 2025-26 బడ్జెట్‌పై సూచనల కోసం ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..! 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 2025-26 బడ్జెట్‌పై సూచనల కోసం ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..! 
    2025-26 బడ్జెట్‌పై సూచనల కోసం ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..!

    PM Modi: 2025-26 బడ్జెట్‌పై సూచనల కోసం ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 24, 2024
    05:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

    బడ్జెట్‌కు సంబంధించిన అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు,నిపుణులతో సమావేశమయ్యారు.

    ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.

    ఈ సమావేశానికి నిర్మలా సీతారామన్‌తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ,సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం,ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్,సుర్జిత్ భల్లా,డీకే జోషి వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు హాజరయ్యారు.

    2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి మందగమనం దృష్ట్యా ఈ సమావేశం నిర్వహించారు.

    సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 5.4 శాతానికి తగ్గిపోగా,ఇది దాదాపు రెండేళ్ల కనిష్ఠం. ఆర్‌బీఐ అంచనాలకు మించి వృద్ధి తగ్గుదల చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది.

    వివరాలు 

     ప్రీ-బడ్జెట్‌ సమావేశంలో ప్యాకేజీ కేటాయింపులపై చర్చ 

    గతేడాది ఇదే సమయంలో 8.1శాతం వృద్ధి నమోదు కాగా,ఈఏడాది తగ్గుదల కనిపించింది.

    రేటింగ్‌ ఏజెన్సీలు 6శాతం ఎగువ వృద్ధిని అంచనా వేయగా,వాస్తవం తక్కువగా ఉండటం గమనార్హం.

    రాబోయే బడ్జెట్‌లో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చే చర్యలు లేదా సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది.

    ఇదే సమయంలో,అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

    ట్రంప్ భారత్,చైనా వంటి దేశాల వస్తువులపై సుంకాలను పెంచుతామని వెల్లడించడం,రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఆర్థిక మంత్రులు నిర్వహించిన ప్రీ-బడ్జెట్‌ సమావేశంలో ప్యాకేజీ కేటాయింపులపై చర్చ జరగడం వంటి అంశాలు కూడా ప్రాధాన్యత సాధించాయి.

    పంజాబ్,కేరళ వంటి రాష్ట్రాలు వడ్డీ లేని 50ఏళ్ల రుణాల కేటాయింపులను పెంచాలని కోరడంతో కేంద్రం బడ్జెట్‌పై మరింత దృష్టి సారించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    Narendra Modi: కచ్‌లో సైనికులతో మోదీ.. సరిహద్దుల్లో ప్రత్యేక దీపావళి వేడుకలు దీపావళి
    Bibek Debroy: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం ఇండియా
    Narendra Modi: మిత్రుడికి అభినందనలు.. ట్రంప్‌ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం డొనాల్డ్ ట్రంప్
    PM Modi: మహారాష్ట్ర ర్యాలీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025