NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi - Muhammad Yunus: మహమ్మద్‌ యూనస్‌కు భారత ప్రధాని మోదీ లేఖ
    తదుపరి వార్తా కథనం
    Modi - Muhammad Yunus: మహమ్మద్‌ యూనస్‌కు భారత ప్రధాని మోదీ లేఖ
    మహమ్మద్‌ యూనస్‌కు భారత ప్రధాని మోదీ లేఖ

    Modi - Muhammad Yunus: మహమ్మద్‌ యూనస్‌కు భారత ప్రధాని మోదీ లేఖ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 27, 2025
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నబంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌కు ఒక లేఖ అందింది.

    ఈలేఖను బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ రాశారు.

    బంగ్లాదేశ్ మార్చి 26నస్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది.ఈసందర్భంగా 1971లో భారత సైనిక సహాయంతో తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిన చారిత్రాత్మక ఘట్టాన్ని మోడీ ఈలేఖలో ప్రస్తావించారు.

    ఈలేఖలో ప్రధాని మోడీ చరిత్రను గుర్తు చేస్తూ,1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట స్ఫూర్తిని భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య గట్టి సంబంధాలకు పునాదిగా పేర్కొన్నారు.

    బంగ్లాదేశ్ ఆవిర్భావంలో భారతదేశం పోషించిన కీలకపాత్రను గుర్తుచేశారు.

    బంగాబంధు షేక్ ముజిబుర్ రెహ్‌మాన్ వారసత్వాన్నితుడిచిపెట్టివేయడానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో,మోడీ తన లేఖలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని ప్రస్తావించారు.

    వివరాలు 

    షేక్ హసీనా తిరిగి రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశాలపై చర్చలు

    బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ విడుదల చేసిన సందేశంలో, ప్రధాని మోడీ బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి, "ఈ రోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు గుర్తుగా నిలుస్తుంది. ఇవే మన ద్వైపాక్షిక సంబంధాల బలమైన పునాదులు" అని పేర్కొన్నారు.

    ఇదిలా ఉండగా, యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తిరిగి రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.

    షేక్ హసీనా అధికారాన్ని వీడిన తర్వాత, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారతదేశంపై ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం గమనించదగిన అంశం.

    అయితే, పలు రంగాల్లో భారతదేశంపై ఆధారపడిన బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్లీ దాని సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    PM Modi: 'భారత్‌కు రావడానికి ఇదే సరైన సమయం': పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన  మోదీ  ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
    Threat Call: మోదీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు..  ముంబయి పోలీసులకు బెదిరింపు కాల్‌   భారతదేశం
    US-France Visit: మార్సెయిల్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  అంతర్జాతీయం
    PM Modi:అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు? ఎలాన్ మస్క్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025