NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: మోదీ
    అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: మోదీ

    PM Modi: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    06:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ కోసం ఇది మంగళప్రదమైన ప్రారంభమని అభివర్ణించారు.

    అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

    అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కనెక్టివిటీకి ఇది ఒక కొత్త శకం ఆరంభమవుతుందని చెప్పారు.

    పునఃనిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు.

    తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ఆయన,"దుర్గాభవానీ విరాజిస్తున్న ఈ పవిత్ర భూమిలో మీ అందరిని కలవడం సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు.

    వివరాలు 

    చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు.. 

    తన ప్రసంగంలో పలు సందర్భాల్లో తెలుగు పదాలు ఉపయోగించి శ్రోతలను ఆకట్టుకున్నారు.

    "టెక్నాలజీ నాతో మొదలైందని చంద్రబాబు నాయుడు గారు నన్ను మెచ్చుకున్నారు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించాను. ప్రభుత్వ అధికారులను పంపించి అక్కడి మోడల్‌ను పరిశీలించాను. భారీ ప్రాజెక్టులు చేపట్టడంలో, వేగంగా పూర్తి చేయడంలో చంద్రబాబుగారికే అనుభవం ఉంది. ఈ విషయాల్లో ఆయనకు దేశవ్యాప్తంగా సాటి లేరు" అన్నారు.

    2015లో అమరావతికి శంకుస్థాపన చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. గత దశాబ్దంలో అమరావతికి కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సహకరించిందని, ఇప్పుడూ అదే విధంగా సహాయాన్ని కొనసాగిస్తామని మోదీ స్పష్టం చేశారు.

    వివరాలు 

    పవన్ జీ - "ఇది మనం చేయాల్సిన పని"

    "ఎన్టీఆర్ వికసిత ఆంధ్రప్రదేశ్‌ కలలు కన్నారు.మనందరం కలిసి ఆ కలను సాకారం చేయాలి.

    పవన్ కల్యాణ్ గారూ, ఇది మన బాధ్యత. మనమే చేస్తాం" అని చెప్పారు.

    భారతదేశం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందుతోందని తెలిపారు.

    రైలు,రోడ్డు ప్రాజెక్టులకే వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.అమరావతిని చూసి తనకు ఇది ఒక నగరం మాత్రమే కాదు,ఓ కల నెరవేరే స్థలం అని అనిపించిందన్నారు.

    దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసినట్టు తెలిపారు.

    "ఈనిర్మాణాలు కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు..ఇవి వికసిత భారత్‌కు బలమైన పునాదులు" అన్నారు.

    వీరభద్రస్వామి,అమరలింగేశ్వరస్వామి,తిరుపతి వెంకటేశ్వరునికి నమస్కరిస్తూ, ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, పవన్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

    వివరాలు 

    అమరావతికి ప్రాధాన్యం - అభివృద్ధికి కేంద్ర బలం 

    "ఇంద్రలోక రాజధాని అమరావతి కాగా, ఇప్పుడు ఏపీ రాజధానిగా అదే పేరు ఉంది. ఇది స్వర్ణాంధ్ర నిర్మాణానికి శుభ సూచకం. అమరావతి ఒక నగరం కాదు, అది శక్తి. ఇది యువత కలలు సాకారమయ్యే రాజధాని అవుతుంది. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇది ప్రాధాన్య కేంద్రంగా మారుతుంది. హరిత శక్తి, పరిశుభ్ర పరిశ్రమలు, విద్య, వైద్యంలో అమరావతిని అభివృద్ధి చేస్తాం. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహాయంగా నిలుస్తుంది" అని మోదీ స్పష్టం చేశారు.

    వివరాలు 

    కనెక్టివిటీ రంగంలో విప్లవాత్మక మార్పులు 

    "రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం ఆరంభమవుతోంది. రైల్వే ప్రాజెక్టులు జిల్లాల మధ్య, ఇతర రాష్ట్రాలతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తున్నాయి. ఇది యాత్రికులకు, పర్యాటక అభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో తెలుగు రాష్ట్రాలకు కేవలం రూ.900కోట్లు మాత్రమే రైల్వే బడ్జెట్‌గా ఇచ్చేవారు. ఇప్పుడు ఏపీకి రూ.9వేల కోట్ల బడ్జెట్ కేటాయించాం. గత 10ఏళ్లలో 750రైల్వే బ్రిడ్జీలు, అండర్‌పాస్‌లు నిర్మించాం. వందే భారత్‌, అమృత్ భారత్‌ రైళ్లు రాష్ట్రానికి కేటాయించాం. 70కి పైగా స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం" అని వివరించారు.

    ఈ అభివృద్ధితో పరిశ్రమలు బలపడతాయని,వేలాది యువతకు ఉపాధి కలుగుతుందని తెలిపారు.

    రైతుల సంక్షేమానికి రూ.17వేల కోట్లకు పైగా మద్దతుగా అందించామన్నారు.పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంలో సహకరిస్తామని,ప్రతి ఎకరాకు నీరు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

    వివరాలు 

    మహిళలు, కార్మికులు - వికసిత్ భారత్‌కు నాలుగు స్తంభాలు 

    "వికసిత్ భారత్ నిర్మాణానికి మహిళలు, కార్మికులు ముఖ్యమైన నాలుగు స్తంభాల్లా ఉంటారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. నాగాయలంకలో ఏర్పాటు చేసిన టెస్టింగ్ రేంజ్‌ భారత రక్షణానికి శక్తినిస్తుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించే ప్రతి రాకెట్‌ ప్రతి భారతీయుడిలో గర్వాన్ని కలిగిస్తుంది. భారత శక్తి ఆయుధాల్లో కాదు - ఐక్యతలో ఉంది. విశాఖలో యూనిటీ మాల్‌ను అభివృద్ధి చేస్తున్నాం" అని ప్రధాని వివరించారు.

    వివరాలు 

    యోగా డే - విశాఖలో ప్రధాని హాజరు 

    "జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా డేలో పాల్గొంటాను. నన్ను ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మన యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వచ్చే 50 రోజులు రాష్ట్రవ్యాప్తంగా యోగా శ్రద్ధ పెంచేలా చేయాలి. ఏపీ ప్రజల్లో కలలు కనేవారు చాలామంది ఉన్నారు. ఆ కలల్ని నెరవేర్చేవారూ ఎక్కువే. రాష్ట్రం సరైన దారిలో, సరైన వేగంతో ప్రయాణిస్తోంది. ఈ అభివృద్ధిని కొనసాగించాలి" అన్నారు.

    వివరాలు 

    మూడు సంవత్సరాల్లో అమరావతి పూర్తవుతుంది 

    "మూడేళ్లలో అమరావతి పనులు పూర్తవుతాయని సీఎం చెప్పారు. ఆ పనులు పూర్తయితే ఏపీ జీడీపీ ఎంతగా పెరుగుతుందో ఊహించగలను. ఇది రాష్ట్ర చరిత్రను మార్చే మలుపు అవుతుంది. ఈ అభివృద్ధి యాత్రలో నేను కూడా మీతో కలిసి పయనిస్తాను. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమరావతి

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    నరేంద్ర మోదీ

    Prime Minister Modi: ఆదివాసీల సంప్రదాయ ఆహారం ఇప్పపువ్వు లడ్డూ.. మన్‌కీబాత్‌లో నరేంద్ర మోదీ ప్రశంస  మన్ కీ బాత్
    PM Modi: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు.. ఆనందం, విజయం కలగాలని ప్రధాని ట్వీట్ యోగి ఆదిత్యనాథ్
    Nidhi Tewari :ప్రధానమంత్రి మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకం.. ఆమె ఎవరంటే..! భారతదేశం
    Modi-Stalin:డీలిమిటేషన్‌పై ఆందోళన..ప్రధాని మోదీతో అత్యవసర భేటీకి సమయం కోరిన స్టాలిన్ ఎం.కె. స్టాలిన్

    అమరావతి

    AP New Airport : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఆ ప్రాంత రూపురేఖలు మార్చే ప్రణాళిక! నారా లోకేశ్
    Ap Tourism :పర్యాటక రంగం అభివృద్ధిపై ఏపీ స్పెషల్ ఫోకస్.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు! భారతదేశం
    Amaravati: అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. అమరావతి టవర్ల పునాదుల పునః ప్రారంభం ఆంధ్రప్రదేశ్
    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులకు ఈసీ అనుమతి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025