NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 
    నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

    PM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా పరంగా వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

    ముఖ్యంగా జాతీయ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

    ఈ క్రమంలో పెహల్‌గామ్‌ ఉగ్రదాడి, దానికున్న అనుబంధ పరిణామాలపై చర్చించేందుకు భద్రతా వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది.

    ఈ అత్యవసర భేటీకి ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహించనున్నారు.

    వివరాలు 

    కమిటీ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు

    ఈసంఘటనపై సీసీఎస్‌ భేటీ జరగడం ఇది రెండవసారి.దాడి జరిగిన వెంటనే మొదటిసారి ఈ కమిటీ సమావేశమై,అప్పట్లో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.

    అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం,పాకిస్థాన్‌తో ఉన్న దౌత్య సంబంధాలను తగ్గించడం,అటారీ సరిహద్దును మూసివేయడం,పాకిస్తాన్‌ పౌరుల వీసాలను రద్దు చేయడం వంటి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

    ఇప్పుడు జరగనున్న తాజాభేటీలో పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరింత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

    భద్రతాకమిటీ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ కూడ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

    ఈ కమిటీలో రాజ్‌నాథ్ సింగ్‌,అమిత్ షా,నితిన్ గడ్కరీ,జేపీ నడ్డా,నిర్మలా సీతారామన్ తదితర సీనియర్‌ మంత్రులు సభ్యులుగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    PM Modi: రామనవమికి పంబన్ వంతెనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి భారతదేశం
    Modi - Muhammad Yunus: మహమ్మద్‌ యూనస్‌కు భారత ప్రధాని మోదీ లేఖ భారతదేశం
    PM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ ఇండియా
    Naxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన ఛత్తీస్‌గఢ్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025