NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MLC elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    MLC elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
    తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    MLC elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 27, 2025
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.

    రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించనున్నారు.

    మొత్తం మూడు నియోజకవర్గాల్లో 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

    కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 3,55,159 మంది ఓటర్లు హాజరవ్వనుండగా, 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

    ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 27,088 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ స్థానంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

    Details

    773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు

    ఈ నాలుగు జిల్లాల్లో అధికారులు 773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

    వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ 25,797 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

    ఈ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అధికారుల ఆధ్వర్యంలో 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షించారు.

    బుధవారం సాయంత్రం కల్లా సంబంధిత జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది అవసరమైన సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఎమ్మెల్సీ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    తెలంగాణ

    Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు ఆంధ్రప్రదేశ్
    Telangana: ప్రణాళికా శాఖ గణాంకాల సంకలనం విడుదల.. రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం  భారతదేశం
    Sand Door Delivery: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇసుక డోర్ డెలివరీ భారతదేశం
    Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం కేంద్ర ప్రభుత్వం

    ఎమ్మెల్సీ

    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎన్నికలు
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఆంధ్రప్రదేశ్
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025